గ్రామాల్లో గంజాయి కల్తీకల్లు నిర్మూలిద్దాం పోస్టర్ ఆవిష్కరణ.

ఎస్సై జి శ్రవణ్ కుమార్.

చిట్యాల, నేటి ధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండwల ఎస్ఐ జి శ్రావణ్ కుమార్ మరియు తన సిబ్బంది చిట్యాల మండలంలోని అన్ని గ్రామాలకి వెళ్లి గ్రామ సెంటర్లలో బస్టాండ్లో గంజాయి మరియు కల్తీకల్లు నిర్మూలన గురించి వాల్ పోస్టర్లు అతికించి మండల ప్రజలని ఎవరైనా గంజాయి విక్రయించిన కల్తీకల్లు( అల్ప్రోజలం మరియు డైజొఫామ్) కలిపిన కల్లును విక్రయించిన డయల్ 100, ఎస్సై చిట్యాల 8712658124 లేదా తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్ బ్యూరో 8712671111 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలని చెబుతూ, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, గంజాయి వాడకం పట్టణాల నుండి పల్లెలకు చాప కింద నీరులా కూడా పాకిందని యువత తల్లిదండ్రులు ఇప్పుడు కూడా వారి పిల్లల్ని గమనిస్తూ ఉండాలని గంజాయి తాగే వారిలో మత్తు అనేది నరాల వ్యవస్థ పై పని చేస్తుందని ఇంత ముందు ఎప్పుడు లేని విధంగా విపరీతమైన ఆకలి విపరీతమైన నవ్వు వస్తుంటాయని ఇటువంటి మార్పులు ఏవైనా చోటు చేసుకుంటే వెంటనే సంప్రదించాలని వారికి అవసరానికి మించి డబ్బులు ఇవ్వకూడదని తెలుపుతూ ప్రస్తుతం గంజాయిని అనేక రకాలుగా చాక్లెట్ల రూపంలో మిల్క్ షేక్ ల రూపంలో అమ్ముతున్నారు కనుక తల్లితండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు, గ్రామాలలో ఎవరైనా గంజాయి విక్రయిస్తున్న సమాచారం ఉన్న సేవిస్తున్న సమాచారం ఉన్న వెంటనే తెలియపరచాలని మన యువతను రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు
ఇట్టి కార్యక్రమంలో కానిస్టేబుల్స్ సిద్ధార్థ లాల్ సింగ్ నవీన్ లింగన్న పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *