*మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
రుద్రంగి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మూడో సారి బారస ప్రభుత్వన్నీ ఏర్పాటు చేద్దాం అని తెలంగాణ రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం రోజున రుద్రoగి మండలం మానాల , పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించారు…మానాల గ్రామంలోని 2 కోట్ల 20 లక్షలతో తాతమ్మ ఒర్రెపై బ్రిడ్జి నిర్మాణం కోసం,1కోటి 12 లక్షలతో గొర్రెగుండెం గంగ వరకు బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 20 లక్షలతో నూతనంగా నిర్మించిన దెగవత్ తండా గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అర్హులైన 759 మంది లబ్ధిదారులకు పోడు భూములకు పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఒకనాడు మానాల అంటే నక్సలైట్లతో అలజడి ఉండడానికి నేడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు. మూడోసారి తన అమూల్యమైన ఓటు కార్ గుర్తుపై వేసి మరోసారి తెలంగాణ రాష్ట్రంలో భారస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బాల్కొండ నియోజకవర్గ ప్రజలు ముందుండాలని అన్నారు.. కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మభ్య పెట్టడం చూస్తున్నారని కావున ప్రజలందరూ గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.