
Fight Against Anti-Labour Black Laws – Singareni Union Call
కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుదాం
కామెర గట్టయ్య
తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుల
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణంలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి టి ఎస్ యు ఎస్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య మాట్లాడుతూ
నల్ల చట్టాలకు ఆజ్యం పోస్తున్న గుర్తింపు ప్రాతినిత్య కార్మిక సంఘాలు.
సింగరేణిలో కోడ్ ఆఫ్ డిస్ప్లేన్ . అమలు చేస్తూ కార్మికులు కార్మిక సంఘాలు మాట్లాడకుండా హక్కుల గురించి ప్రశ్నించకుండా మాట్లాడే స్వేచ్ఛను కాల రాస్తున్న కార్మికులకు వాక్ స్వాతంత్రం లేకుండా చేసే కుట్రను కార్మిక వర్గం కార్మిక సంఘాలు ఒక తాటిపై నడిచి తిప్పి కొట్టాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్మికులకు కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేస్తుంది
సింగరేణి యాజమాన్యం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఒకటిగా నిలబడి కార్మికుల శ్రమపై ఆధారపడిన యాజమాన్యం కార్మికుల వాక్కు స్వాతంత్రాన్ని విస్మరిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్మికులను కట్టు బానిసలుగా చేయుటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వంత పాడుతున్న సింగరేణి యాజమాన్యం గుర్తింపు కార్మిక సంఘం ప్రాతినిధ్య కార్మిక సంఘం కార్మికులను మోసం చేస్తూ పబ్బం గడుపు కుఉంటుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు టాక్సీల పేరుతో కోట్లది రూపాయలు కడుతున్న కూడా కనికరించని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయాలని గత కొన్ని సంవత్సరాల కాలం నుండి ఉద్యమిస్తున్న కార్మిక సంఘాలను కార్మికుల నుండి దూరం చేయుటకు సింగరేణి యాజమాన్యం కూడా డిస్ప్లే న్ పేరుతో కార్మిక సంఘం నాయకులు బ్యాలెట్ తో కార్మిక వర్గం దగ్గరికి తమ అభిప్రాయాలను తెలుపాలని వచ్చిన కార్మిక సంఘం నాయకులను గేటు దాటవద్దని హుకుం జారీ చేయడాని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం యాజమాన్యం మొండి వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉంది సింగరేణిలో 1998.ఎన్నికల తర్వాత ఒకే సంఘం పేరుతో కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసిన గుర్తింపు సంఘం. ఏఐటీయూసీ మళ్లీ పాత పద్ధతిని 2025 లో అదే నల్ల చట్టాలు కోడ్ ఆఫ్ డిసిప్లిన్ పేరుతో కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయుటకు కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలనే పోరాటాన్ని నిర్వీర్యం చేయుటకే కానీ కార్మిక హక్కుల్ని కాపాడుకొనుటకు కాదు అనేదాన్ని సింగరేణి కార్మిక వర్గం గ్రహించి గుర్తింపు కార్మిక సంఘం నాయకులను కార్మికులు నిలదీయాలని కోరుతుంది సింగరేణి కార్మికులను పకృతికి విరుద్ధంగా పనిచేసే కార్మికులు బార్డర్ సైనికులతో పోల్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బార్డర్ సైనికునికి ఇచ్చిన గుర్తింపులో సగభాగాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇవ్వడం లేదు సింగరేణి కార్మికులకు కేంద్ర ప్రభుత్వానికి కూడా టాక్సీల రూపంలో కార్మికులు పన్నులు కడుతూనే ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వాళ్ళ సంక్షేమానికి ఏమీ జవాబుగా నిలిచిందో కార్మిక వర్గం గ్రహించాలి అని కోరుతున్నామని బార్డర్ లో సైనికుని 15 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న సైనికునికి హైదరాబాద్ పట్టణ పరిసర ప్రాంతాలలో రెండు గుంటల జాగా ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం 60 సంవత్సరాలు సింగరేణి కార్మికుల రక్తాన్ని చెమటలు మార్చి దేశానికి వెన్నెముకగా నిలబడితే కార్మికునికి రక్త మాంసాలు ధారపోసి కోట్లాది రూపాయలు లాభాలు తీసుకొస్తున్న కార్మికులకు నివసించుటకు రెండు గుంటల జాగా అడిగితే కార్మికుడు ఉత్పత్తిలో భాగమే తప్ప సొంత ఆస్తి లేదు సొంత ఆస్తిని ఇవ్వము అనే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సింగరేణి యాజమాన్యం వాటికి కొమ్ముకాస్తున్న గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలను కార్మిక వర్గం నిలదీయాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కోరుతుంది దేశంలో ఉత్పత్తి లో భాగమైన విద్యుత్ పరికరంగా మారిన కార్మికుని 40 సంవత్సరాల నుండి తీసుకున్న టాక్సీ లా రూపంలో తీసుకున్న రూపాయలను లెక్కలోకి తీసుకుంటే కార్మికుడు అడిగే రెండు గుంటల జాగా కు సరిపడే రూపాయలు కష్టతరమైన పని కాదని కూడా ఆలోచించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. బే షరతుగా కార్మికులకు రెండు గుంటల జాగా పట్టణ ప్రాంతాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కార్మికుల సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్న కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నా గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలకు బుద్ధి చెప్పుటకు కార్మిక వర్గం సిద్ధం కావాలని ఈసందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కార్మిక సంఘాలన్నీ కూడా ఒక తాటిపై నిలబడి కార్మిక హక్కులను కాపాడుటకు దోహదపడే విధంగా కార్మిక సంఘాల ఎజెండా ఉండాలని ప్రశ్నించే సంఘాలను అన్ని కూడా ఒక వేదికగా ఏర్పడి కార్మిక హక్కుల కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తో పాటు సింగరేణి యాజమాన్యాన్ని కూడా ఒప్పించి సింగరేణి కార్మికుల సొంతింటి పథకాన్ని అమలు చేయుటకు దోహదపడాలని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరింపబడడాలంటే ఐక్య పోరాటాలే శరణ్యమని ఈ సందర్భంగా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య మాట్లాడారు
ఈ సమావేశంలో
టి ఎస్ యు ఎస్ కార్మిక సంఘం నాయకులు
దాసరి జనార్ధన్ కాసర్ల ప్రసాద్ రెడ్డి నామాల శ్రీనివాస్ జయశంకర్ సాజిత్ సలీం నరసింహారెడ్డి యుగంధర్ సిహెచ్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు