
Ghattik Ajay Kumar Pushes for Nekkonda Municipality
రాజకీయాలకు అతీతంగా నెక్కొండను మున్సిపాలిటీగా ఏర్పాటు చేద్దాం
మాజీ ఎంపీపీ ఘటిక అజయ్ కుమార్
#నెక్కొండ, నేటి ధాత్రి:
నెక్కొండను మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడంలో నాడు అన్ని రాజకీయ పార్టీలు హామీలు కురిపించాలని నెక్కొండను మున్సిపాలిటీగా చేయడంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని నెక్కొండ మాజీ ఎంపీపీ ఘటిక అజయ్ కుమార్ ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ నెక్కొండ మండలం రాష్ట్రంలోనే 39 గ్రామపంచాయతీ లతో పెద్ద మండలం గా ఉందని కేవలం నెక్కొండ జనాభా 7700 పైచిలుకు కలిగి ఉన్న నెక్కొండను మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడానికి అన్ని విధాల అర్హతలు పొందిన మండలం నెక్కొండ అని మున్సిపల్ యాక్ట్ 2018 ప్రకారం ఐదు కిలోమీటర్ల లోపు ఉన్న గ్రామపంచాయతీలను నెక్కొండ మున్సిపాలిటీ లోకి పరిగణిస్తే నెక్కొండ తో పాటు నెక్కొండ తండా, గుండ్రపల్లి, పత్తిపాక, అప్పలరావుపేట్, అమీన్ పేట, పనికర, టీకే తండాలతో 176 64 జనాభా విస్తీర్ణం కలిగి మున్సిపాలిటీగా ఏర్పడేందుకు అనుగుణంగా ఉందని వెంటనే స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి, ఉన్నత అధికారులకు సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి నెక్కొండను మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి నెక్కొండను మున్సిపాలిటీగా ఏర్పడేందుకు తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అప్పలరావుపేట మాజీ సర్పంచ్ వడ్డే రజిత సురేష్, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.