ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

మున్సిపల్ కమీషనర్ మహమ్మద్ అయాజ్

జమ్మికుంట: నేటి ధాత్రి
జమ్మికుంట మున్సిపాలిటీని ప్లాస్టిక్ రహిత సమాజంగా నిర్మింద్దామని మున్సిపల్ కమీషనర్ మహమ్మద్ అయాజ్ తెలిపారు. గురువారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని నాయిని చెరువు పరిసర ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్ యండి ఆయాజ్ ఆధ్యర్యంలో ఇటీవల జరిగినటువంటి గణపతి నిమజ్జనం పరిసర ప్రాంతాలలో పరవేయబడినటువంటి ప్లాస్టిక్ మరియు ఇతర చెత్త, చెదారం కమీషనర్ అయాజ్ తో పాటు మున్సిపల్ సిబ్బంది నాయిని చెరువు లో చెత్త తొలగించారు. ప్లాస్టిక్ కవర్లు,పువ్వుల దండలు, కొబ్బరి చిప్పలు మరియు ఇతర చెత్తను తొలగించడంజరిగింది.మున్సిపల్ కమిషనర్ యండి ఆయాజ్ మాట్లాడుతూ నాయిని చెరువు బహిరంగ ప్రదేశాలలో మాల మూత్ర విసర్జన చేసినట్లయితే జరిమానాతో చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని అయన తెలిపారు. ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు మట్టిలో కలిసిపోవని ఎప్పటికి బయటే ఉంటాయని అయన అన్నారు. కూరగాయలు, కిరాణ సామాన్లు కొనేటప్పుడు జ్యూట్ బ్యాగ్ లను వాడాలని అయన మున్సిపాలిటీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ అధికారులతో పాటు పట్టణ ప్రజలు పలువురు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *