తెలంగాణా డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్, లచ్చి రెడ్డి
కాశిబుగ్గ నేటిధాత్రి.
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్ మరియు తెలంగాణ తహసిల్దార్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లచ్చి రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం వరంగల్ లోని ఐశ్వర్య గార్డెన్ లో జరిగిన తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చి రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాలతో రెవెన్యూ వ్యవస్థ ను నిర్వీర్యం చేశారు,రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొన్న అవమానాలను,మన తోటి ఉద్యోగులు రాత్రికి రాత్రి ఎలాంటి సర్వీస్ కాని వయసు గానీ అర్హతలను తీసుకోకుండా 5200 మంది వీఆర్వోలను వేరే శాఖలోకి నిరంకుశ ధోరణితో పంపించడం జరిగిందనీ అన్నారు. గ్రామ రెవెన్యూ అధికారులు వేరే శాఖలోకి వెళ్ళిన సందర్భంలో రెవెన్యూ శాఖలో,గ్రామస్థాయిలో పనిచేసే అధికారులు లేక రెవెన్యూ ఉద్యోగులు అనగా తహసీల్దార్ నుండి జిల్లా కలెక్టర్ స్థాయి వరకు నానా రకాలుగా ఇబ్బందులకు గురవటం జరిగిందన్నారు. అదేవిధంగా వరదలు,కరువు వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రాథమిక విచారణ చేసి నివేదిక సమర్పించే అధికారులు లేకపోవడం, ప్రభుత్వ భూముల ఆక్రమణలను పసికట్టడంలో వైఫల్యం పొందిందని, ప్రజా శ్రేయస్సు కోసం ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించి,నిర్ణయం తీసుకుందని అన్నారు.అందుకు అనుగుణంగా రెవెన్యూ వ్యవస్థను తిరిగి బలోపేతం చేసేలా,రెవెన్యూ వ్యవస్థ పునర్ వైభవంలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి కృషి చేయాలని కోరారు.
⏩ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన బాధ్యత రెవెన్యూ ఉద్యోగుల మీద ఉంది.
టి జి టి ఏ స్టేట్ జనరల్ ప్రెసిడెంట్ పాక రమేష్
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వము అమలుపరిచే ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసే బాధ్యత రెవెన్యూ ఉద్యోగుల మీద ఉందని గుర్తు చేశారు. అలాంటి రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం,పునర్ వైభవం తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నం చేసి ధరణి 2020 మూలంగా సామాన్య రైతు తను కోల్పోయిన భూములను పొందాలంటే కోర్టుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగారని అన్నారు.కానీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించి కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చి పట్టాదార్ పాస్ బుక్కులు జారీ చేసే అధికారం తాహసిల్దార్ కు,ఆర్ డి ఓ కు కల్పించడం చాలా శుభ పరిణామం గా భావిస్తున్నామని తెలిపారు.
⏩ రెవీన్యూ నూతన చట్టం భూ భారతి అవసరం ఎంతైనా ఉంది.
టి జి టి ఏ స్టెట్ జనరల్ సెక్రటరీ: ఫూల్ సింగ్ చౌహాన్
దేశంలోనే పలు రాష్ట్రాల రెవెన్యూ చట్టాలను అధ్యయనం చేసి తెలంగాణ ప్రజల భౌగోళిక స్వరూపాన్ని బట్టి దానికి అనుకూలమైనటువంటి నూతన రెవెన్యూ చట్టం భూభారతి అవసరం ఎంతైనా ఉన్నదని అన్నారు.తెలంగాణ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయుటకు ఎలాంటి సమస్య అయినా మండల స్థాయిలో పరిష్కరించుటకు భూభారతి చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని ఫూల్ సింగ్ చౌహాన్ చెప్పారు.
⏩తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ సభ్యత్వం కొరకు యాప్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రారంభం.
టి జి టి ఏ స్టేట్ ప్రెసిడెంట్ : రాములు.
మొట్ట మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ టి జి ఆర్ ఎస్ ఏ సభ్యత్వ నమోదు యాప్ కార్యక్రమాన్ని గౌరవించి లచ్చిరెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి రెవెన్యూ సంక్షేమం కొరకు రెవెన్యూ సమస్యలు పరిష్కారం కొరకు ఈ యాప్ లో సభ్యత్వ నమోదు చేసుకోవాలని కోరారు.
⏩ పెండింగ్ లో ఉన్న వీఆర్ఏలకు పోస్టింగ్ ఇప్పించాలి.
టి జి టి ఏ స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్.
మొహ్మద్ ఇక్బాల్.
గత ప్రభుత్వ హయాంలో వీఆర్ఏలను రెండు వర్గాలుగా విభజించి 60 సంవత్సరాల లోపల ఉన్న వారికి జూనియర్ అసిస్టెంట్ లుగా పోస్టింగ్ లు ఇచ్చారని 61 సంవత్సరాలు దాటిన వారికి ఇంకా పోస్టులు ఇవ్వకుండా పెండింగ్లో ఉన్నందున, వారి సమస్యను సానుకూలంగా స్పందించి పెండింగ్ లో ఉన్న 3797 మంది వి.ఆర్. ఏ లకి పోస్టింగ్ లు ఇప్పించాలని టి జి టి ఏ స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ మొహ్మద్ ఇక్బాల్ కోరారు.
⏩ చనిపోయిన వీ ఆర్ ఏ కుటుంబాలకు న్యాయం చేయాలి.
టి జి టి ఏ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ: విక్రమ్ కుమార్
అదే విధంగా ఇంకా పెండింగ్ లో ఉన్న 61 సంవత్సరాలు దాటిన వీఆర్ఏ మరియు చనిపోయిన వీఆర్ఏ ల కుటుంబాలకు న్యాయం చేయాలని టి జి టి ఏ ఆర్గనైజింగ్ సెక్రెటరీ విక్రమ్ కుమార్ కోరడం జరిగింది.
వి.ఆర్. ఏ.ఉద్యోగం చేస్తూ
సీ సీ ఎల్ ఏ కార్యాలయం నుండి జారీ చేసిన సర్కులర్ కంటే ముందు చనిపోయిన వీఆర్ఏలందరికి కూడా వారి వారసులకు వెంటనే ఉద్యోగ అవకాశాలుకు అనుగుణంగా నియమాకాలు చేపట్టి వారి కుటుంబాలను ఆదుకోవాలని, ఇట్టి విషయంలో లచ్చి రెడ్డి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సూర్య, రేణుక తదితరులు పాల్గొన్నారు.
⏩వరంగల్,హనుమకొండ మండలాల నూతన టీ జీ ఆర్ ఎస్ ఏ కమిటీ ఏర్పాటు.
హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ముత్తినేని రంజిత్ కుమార్, జనరల్ సెక్రటరీగా ప్రసాద్ జేఏసీ చైర్మన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి హనుమకొండ జిల్లా టి జి ఆర్ ఎస్ ఎ సెక్రటరీగా రంజిత్ కుమార్, జనరల్ సెక్రటరీగా జి నాగేంద్రప్రసాద్,అదే విధంగా వరంగల్ జిల్లా అధ్యక్షులుగా నాగేంద్రప్రసాద్ జనరల్ సెక్రటరీగా కీర్తన్ ఎంపిక అయ్యారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ గా సుభాన్, సుమన్ జలపతి ఎన్నిక అయ్యారు.