Mulkallapalli Sarpanch Offers Votive Ornaments to Sammakka-Saralamma
నిత్యం జనపక్షాన ప్రశ్నించే గొంతును గెలిపించండి
* ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే నాయకులను నమ్మకండి
* ప్రజలకు సేవ చేసే నాయకులను నమ్మి తమ అమూల్యమైన ఓటు వేయాలి
* చేవెళ్ళ మున్సిపాలిటీ 17 వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కడమంచి ఆనంద్
చేవెళ్ల, నేటిధాత్రి:
చేవెళ్ళ మున్సిపల్ ఎన్నికల్లో 17 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీలో ఉన్న బీ ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కడమంచి ఆనంద్ వార్డులో ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలుసుకుని తమ విలువైన ఓటుతో మేధావులను చదువుకున్న విజ్ఞాన వంతులను సామాజిక బాధ్యత ఉన్న పౌరులను ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. డబ్బు, మద్యానికి కాకుండా 5 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేసే వారిని ప్రశ్నించే గొంతులను గెల్పించాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందని చెప్పారు. చేవెళ్ళ మున్సిపల్ ఎన్నికల్లో ఉన్న 18 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు ఓటర్లు ఉత్సాహంగా ఉన్నారని స్పష్టం చేశారు. కాలనీలలో ప్రచారం కొనసాగిస్తుంటే ప్రజలు ఏళ్ల తరబడి ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఇన్నాళ్లు కేవలం పదవుల కోసమే పనిచేశారని ప్రజా సమస్యలపై దృష్టి సారించలేకే ఇలాంటి దుస్థితి ఏర్పడ్డదని వాపోయారు. పదవులు వచ్చాక ప్రజలను , అభివృద్ధిని మరిచిపోయే నాయకులను గెల్పించకూడదని స్పష్టం చేశారు. ప్రజలు గెలిపించే నాయకులను నిత్యం ప్రశ్నించాలంటే ఎటువంటి ప్రలోభాలకు తావివ్వకూడని సూచించారు. ఇన్నాళ్లు ప్రశ్నించలేకే కాలనీల్లో సమస్యలు సమస్యలుగానే మిగిలిపోయాయని అన్నారు. తనను గెలిపిస్తే వార్డును అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కటికే రమేష్, మహమ్మద్ ఖలీల్, బాబు, కాలనీ పెద్ద మనుషులు సత్యనారాయణ, విష్ణు తదితరులు అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ప్రచారంలో పాల్గొన్నారు.
