
Leela Group Chairman Supports Deceased Family in Konapur
కోనాపూర్ గ్రామంలో దివంగత కుటుంబానికి లీలా గ్రూప్ చైర్మన్ మోహన్ నాయక్ పరామర్శ..
రామాయంపేట సెప్టెంబర్ 3 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట మండలంలోని కోనాపూర్ గ్రామంలో లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ గారు దివంగత కరికి బాబు కుటుంబాన్ని ఈరోజు పరామర్శించారు. ఇటీవల మరణించిన కరికి బాబు కుటుంబానికి ఆయన ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా రూ.5,000 నగదు, 25 కిలోల బియ్యం అందజేసి వారి కుటుంబానికి అండగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు చింతాల స్వామి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు విద్యాసాగర్, మండల నాయకులు మామిడి సిద్ధిరాములు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పసుల అంజయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం సురేష్, యూత్ అధ్యక్షులు మామిడి సతీష్, ప్రధాన కార్యదర్శి కరికి రాజు, చాకలి భీమయ్య తదితరులు పాల్గొన్నారు.