నేటిధాత్రి, దేశాయిపేట
గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ ఎనుమాముల ప్రాంతానికి చెందిన సీనియర్ రిపోర్టర్ (టీవి5) బండి రవి తండ్రి బండి కుమారస్వామి ఇటీవల అనారోగ్యంతో మరణించగా, గురువారం 14వ డివిజన్ కు చెందిన ఎన్టీఆర్ నగర్, ఎస్ ఆర్ నగర్, సుందరయ్య నగర్ కు చెందిన వివిధ పార్టీల నాయకులు బండి రవితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బండి రవిని పరామర్శించిన వారిలో వివిధ పార్టీల నాయకులు ముడుసు నరసింహ, కేతిరి రాజశేఖర్, ఈర్ల రాజేందర్, కొత్తకొండ రాజు, పసులాది మల్లయ్య, ఉప్పునూతల రాజు, అంకేశ్వరపు సతీష్, తదితరులు ఉన్నారు.