
భద్రాచలం నేటి ధాత్రి
ఈరోజు 16.10.2024న భద్రాచలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు ని భద్రాచలం డివిజన్ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్ పర్సన్స్ అసోసియేషన్ డివిజన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో చల్ల గుళ్ళ నాగేశ్వరరావు . కేఎస్ ఎల్వి ప్రసాద్ . డి కృష్ణమూర్తి ,సుబ్బయ్య చౌదరి, రాజబాబు ,శివప్రసాద్, ఐలయ్య, రాజు తదితరులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కలిసి పెన్షనర్స్ కార్యాలయానికి స్థలాన్ని కేటాయించాలని కోరుతూ మెమోరాండం సమర్పించారు , MLA డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ మీ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లి మీకు తప్పనిసరిగా స్థలాన్ని కేటాయిస్తానని భవన నిర్మాణానికి కూడా సహకరిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భోగాల శ్రీనివాసరెడ్డి, కొండిశెట్టి కృష్ణమూర్తి, వెంకటరెడ్డి, ఎండి నవాబ్, రత్నం రమాకాంత్. తిరుపతిరావు. రమేష్ గౌడ్ బొంబోతుల రాజీవ్, తదితర నాయకులు పాల్గొన్నారు,
బందు వెంకటేశ్వరరావు అధ్యక్షులు.
కె ఎస్ ఎల్ వి ప్రసాద్ ప్రధాన కార్యదర్శి.
డి కృష్ణమూర్తి కోశాధికారి భద్రాచలం