Grand Shiva-Parvati Kalyanam at Sangameshwara Temple
చైర్ పర్సన్, వైస్ చైర్ లను శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికలలో ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగి చివరకు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు, సురేష్ కుమార్ షట్కార్, మాజీ మంత్రివర్యులు, డాక్టర్ చంద్రశేఖర్, తెలంగాణ రాష్ట్ర సట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, మాజీ ఇండస్ట్రియల్ చైర్మెన్ మొహమ్మద్ తన్వీర్, రాష్ట్ర నాయకులు ఉజ్వల్ రెడ్డి, ఉద్దండ రాజకీయ దురందరులు ఒకే వేదిక పైకి వచ్చి జహీరాబాద్ మునిసిపాలిటీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బిఆర్ఎస్ పార్టీని అద పాతాళానికి అణగదొక్కి మరోసారి జహీరాబాద్ గడ్డ కాంగ్రెస్ అడ్డ అని నిరూపించి పూర్వవైభవాన్ని తీసుకొచ్చారు నేడు మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైఫ్ చైర్పర్సన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, ఎంఐఎం పార్టీ కౌన్సిలర్లు, స్వతంత్ర అభ్యర్థులు అందరూ కలిసి గౌరవనీయులు అందరికీ ఆమోదయోగ్యులైనటువంటి మహమ్మద్ యూనుస్ గారిని చైర్పర్సన్ గా, శిరీష రెడ్డి గారిని వైఫ్ చైర్పర్సన్ గా ఎన్నుకొని జహీరాబాద్ పట్టణ బాధ్యతలన్నింటిని తమరి భుజస్కందాల పైన పెట్టడం జరిగింది. ఈ ఐదు సంవత్సరాలు పట్టణ అభివృద్ధికి అందరి సహకారం తీసుకొని అభివృద్ధిలో అగ్రగామిగా ఉంచడానికి శాయశక్తుల కృషి చేస్తారని ఆశిస్తూ జహీరాబాద్ నియోజకవర్గంలో మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ బాగా రెడ్డి గారి హయాంలో, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు గీతారెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు స్వర్గీయ మహమ్మద్ ఫరీదోద్దీన్ గారి ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచిన మాట వాస్తవం అని తెలియజేస్తూ ఎన్నికైన జహీరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మహమ్మద్ యూనుస్ గారికి, వైస్ చైర్ పర్సన్ శిరీష రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు,
