మాట నిలుపుకున్న నేత పరమేశ్వర్ రెడ్డి

పాత రామంతాపూర్ లో ని డాక్టర్ బి .ర్ .అంబెడ్కర్ కమ్యూనిటీ హాల్ అదనపు అంతస్తుకు రూ.36 లక్షల నిధులు మంజూరు

ఉప్పల్ నేటి ధాత్రి ఫిబ్రవరి 21

ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి నిలుపుకున్నారు.

పాత రామంతాపూర్ లో కమ్యూనిటీ హాల్ 2వ అంతస్తు నిర్మాణానికి నిధులను మంజూరు చేయించారు.

కమ్యూనిటీ హాల్ అంతస్తు నిర్మాణానికి మంజూరు అయిన రూ. 36 లక్షలకు సంబంధించిన అలాట్ మెంట్ కాపీలను పరమేశ్వర్ రెడ్డి కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీ వాసులకు అంది చేశారు.

రాష్ట్ర అభివృద్ధితోపాటు ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఇదే తరహాలో నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు కృషి చేస్తున్నట్టుగా తెలిపారు.

కార్యక్రమంలో సుర్వి మురళి గౌడ్ ,వల్లపు శ్రీకాంత్ యాదవ్ ,సందీప్ ,
అంబెడ్కర్ సంఘము అధ్యక్షులు ..ముత్యాల జంగయ్య ,
వైస్ ప్రెసిడెంట్ ఆరూరి ఆనంద్ ,
గుండె బిక్షపతి ,ముత్యాల ప్రకాష్ ,
ముత్యాల కుమార్, ప్రధాన కార్యదర్శి చీమకండ్ల జంగయ్య , ట్రెజరరీ ముత్యాల బాబు రావు కమిటీ సలహాదారులు ఆరూరి ఈశ్వర్ ముత్యాల అంజయ్య , కమిటీ సభ్యులు ముత్యాల హరి దర్శన్ తాళ్లపాక కుమార్ ఊదరి శ్రీరామ్ , మరియు యూత్ కమిటీ సభ్యులు .. ముత్యాల నరేష్ ,ముత్యాల ఐలేశ్వర్ ,ముత్యాల శ్రావణ్ కుమార్,ముత్యాల సాయినాథ్ ,పాల్గొనడం జరిగింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *