విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం సరి కాదు..
జహీరాబాద్. నేటి ధాత్రి:
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాఠీ ఛార్జ్ చేయడానికి భారతీయ జనతా యువమోర్చా(బిజేవైఎం) వ్యతిరేకించడం జరుగుతుంది. విశ్వవిద్యాలయం భూములను కాపాడుకోవాలి అదేవిధంగా పర్యావరణాన్ని మూగజీవాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న అమాయక విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం పట్ల బాధ్యత వహిస్తూ ఈరోజు జహీరాబాద్ పట్టణం లో బిజేవైఎం అధ్యారంలో దిష్టి బొమ్మ దహనం చేయడానికి వెళ్తున్న బిజేవైఎం నాయకులను ముందస్తుగా అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది ఈకార్యక్రంలో సోమా అనిల్. నరేష్ పాటిల్ రూషబ్. నిఖిల్ యాదవ్ పాల్గొన్నారు రేవంత్ రెడ్డి తక్షణమే బహిర్గత క్షమాపణ చెప్పాలి అని బిజేవైఎం డిమాండ్ చేసింది.