నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:
భూమిలేని వ్యవసాయ కార్మికులందరికీ రూ.12వేలివ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య, రైతు సంఘం రాష్ట్ర నాయకులుబండ శ్రీశైలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం చండూరు మండల కేంద్రంలో తెలంగాణ వ్యవసాయకార్మిక సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం సిఐటియు సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య అధ్యక్షతనసమావేశం జరిగింది.ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ,భూమిలేనివ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ జాబ్ కార్డు ద్వారా వంద రోజులు పని చేసిన కుటుంబానికి రూ. 12వేల స్కీంకు ఎంపిక చేయబోతున్నట్లు వస్తున్న వార్తలపై ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాలనిఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. వివిధ కారణాల వలన జాబు కార్డు లేని పరిస్థితి ఉన్నదని, దాని ఆధారంగానే లబ్ధిదారులను ఎంపిక చేయడమనేది సరికాదన్నారు. ఈ ఆలోచనకు ప్రభుత్వం తక్షణమే స్వస్తి చెప్పి గ్రామసభలు నిర్వహించిభూమిలేని ప్రతి కూలిని,పేదలకు ఈ స్కీంకు ఎంపిక చేయాలని ఆయన ప్రభుత్వాన్ని వారు కోరారు. ఈ పథకంలో కేవలం ఉపాధి కూలీలను మాత్రమే తీసుకుంటామని అనడం సరి కాదని వారుఅన్నారు. రాష్ట్రంలో భూమిలేని నిరుపేదలు వ్యవసాయ కార్మికులు 40 లక్షల మంది ఉంటే కేవలం 15 లక్షల మందికి మాత్రమే ఈ పథకం వర్తింప చేస్తామనడం నిరుపేదలను ఈ పథకానికి దూరం చేయడమేననివారు అన్నారు.గ్రామ,వార్డు సభలునిర్వహించి భూమి లేని వారిని గుర్తించి వారికి భూమి లేని కార్డు ఇవ్వాలని వారు సూచన చేశారు. ప్రభుత్వ నిబంధనలను సంవరించి గ్రామ సభల ద్వారా లబ్ధిదారులు ఎంపిక చేసి పారదర్శకంగా నిర్వహించాలని వారు రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శిజెర్రిపోతుల ధనుంజయ, సిఐటియు సీనియర్ నాయకులు మొగుదాల వెంకటేశం, చిట్టి మల్ల లింగయ్య, సిపిఎం సీనియర్ నాయకులుకంచర్ల అంజయ్య,వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు బల్లెం స్వామి, గొర్రెల మేకల పెంపకం దార్ల సంఘం నాయకులు ఈరటి వెంకటయ్య, రైతు సంఘం మండల నాయకులు కొత్తపల్లి నరసింహ, రజక సంఘం నాయకులులక్ష్మయ్య, శాలివాహన సంఘం మండల నాయకులు నరసింహతదితరులు పాల్గొన్నారు.
భూమిలేని వ్యవసాయ కార్మికులకురూ. 12 వేలివ్వాలి: వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య
