ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం భూముల రీ సర్వే కంప్లీట్
జైపూర్,నేటి ధాత్రి:
రామగుండంలో ఎయిర్ పోర్ట్ నిర్మించాలని స్థల సేకరణ పై రీ సర్వే చేయాలని గత పది రోజుల క్రితం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర పౌర విమానయానా శాఖ మంత్రి కి వినతి పత్రాన్ని అందించడం జరిగింది.
వెంటనే స్పందించిన ఎయిర్ ఫోర్స్ అథారిటీ శుక్రవారం ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం భూములను పరిశీలించారు.
పెద్దపల్లి జిల్లాలో ఎయిర్ పోర్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఉన్నట్లుగా తెలుస్తుంది.
ఎంపీ వంశీకృష్ణ చొరవతో రీ సర్వే జరగడం ద్వారా రెండు దశాబ్దాల కల నెరవేరబోతుందనీ ప్రజలలో ఆశాభావం వ్యక్తం అవుతుంది.
అంతర్గాం మండల కేంద్రంలోని టెక్ట్స్ టైల్స్ భూములను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఉన్నతాధికారులు సందర్శించి ఎయిర్ పోర్ట్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు.
గతంలో సమర్పించిన భూ రికార్డుల ఆధారంగా ఆ స్థలాన్ని రీ సర్వే నిర్వహించారు.
సమీపంలోని రైల్వే ట్రాక్,రాజీవ్ రహదారి కనెక్టివిటీ,ఇరువైపులా పట్టణాలు తదితర అంశాలపై రెవెన్యూ అధికారులతో చర్చించారు.
అక్కడి నుండి బసంత్ నగర్ ఎయిర్ పోర్ట్ భూములు పరిశీలించారు.ఎయిర్ పోర్ట్ నిర్మాణం ఎంతో అవసరం కాగా అంతర్గాం,బసంత్ నగర్ కేంద్రాల్లో దానిని ఎక్కడ నిర్మిస్తారనే ల్యాండ్ మార్క్ వంటి అంశాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఏఏఐ అధికారులు తీసుకు వెళ్తామన్నారు.
అతి త్వరలో ప్రతిపాదిత స్థలాన్ని గుర్తించి ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు దిశగా అడుగులు వేయనున్నట్లు సమాచారం.
రామగుండం ప్రాంతంలో ఎయిర్ పోర్ట్ చేస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా తో పాటు జగిత్యాల జిల్లా వాసులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి.ముఖ్యంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం కావడం తో వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.
భూములను పరిశీలించిన వారిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ ప్రతినిధులతో పాటు రాష్ట్ర ల్యాండ్ రికార్డ్స్ పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య,అంతర్గాం తాసిల్దార్ రవీందర్ పటేల్ ఉన్నారు.