ప్రజలు ప్రజల ప్రాణాలు పణంగా పెట్టిన లక్ష్మీ ఇన్ఫో

రంగారెడ్డి జిల్లా మాజీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు.
ఉప్పల సంతోషి కుమార్ గుప్తా
కుత్బుల్లాపూర్ నేటి రాత్రి :
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణ పనులు డైరీ ఫార్మ్ రోడ్డు కండ్లకోయ వరకు పనులు జరుగుచున్న సుచిత్రా జంక్షన్ కు సమీపంలో ఉన్న సబ్ రోడ్ లో సెవెన్ హిల్స్ వైన్స్ నుండి మహీంద్రా షోరూం వరకు సబ్ రోడ్ విస్తరణలో భాగంగా సెవెన్ హిల్స్
వైన్స్ ముందు 50 ఫీట్ల నుండి 100 ఫీట్ల గొయ్యి తవ్వడం జరిగింది ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణం పనులు లక్ష్మి ఇన్ఫోవారు పనులు చేస్తున్నారు వారు
.నిర్లక్ష్యంగా తవ్వకాలు జరపడం వలన అక్కడ ఉన్న మెయిన్ శివరేజి పైప్ లైన్ ధ్వంసం వల్ల సెవెన్ హిల్స్ వైన్స్ నుండి రామరాజు నగర్ వరకు వరదల మురికి నీరు ప్రవహిస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో సుమారు 10,000 మంది అన్ని అపార్ట్మెంట్లలో నివసిస్తున్నారు వాళ్లు చేపట్టిన తప్పుడు తవ్వకాల వల్ల అక్కడి ప్రజలు విపరీతంగా ఇబ్బందులు పడుతూ వాహనాలు రాకపోకలు ఇబ్బందులు జరుగుచున్నవి ఆడవారు పిల్లలు ముసలి వాళ్లు ఈ యొక్క నిర్లక్ష్యం తవ్వకాల వలన రోడ్డు దాటలేక వాళ్ళు మురుగునీల నుండి నడవడం జరుగుతుంది ప్రాణాలు పెట్టి రోడ్డు దాటుతున్న వారి యొక్క పలుకుబడితో మేము ఏమి చేసినా చెల్లుతుందని ఒక అహంకారపు ధరణితో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఈ గతవారం నుండి సుమారు పది నుంచి 20 మంది గోతిగుండా ప్రయాణం చేస్తూ టూ వీలర్స్ మీద నుండి జారిపడి గాయాలపాలు అవుతున్నారు నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ఈ యొక్క గోతివలన అక్కడ ఎవరు జారిపడిన ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది ఈ యొక్క లక్ష్మి ఇన్ఫ్రా వాళ్లువారి యొక్క అనుమతులు సరిగ్గా పొందకుండానే నిర్లక్ష్యంగా పనులు చేపట్టడం వలన ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ ఒక్క అంశాన్ని మొత్తం రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు ఉప్పల సంతోష్ కుమార్ గుప్త గారు ప్రాజెక్టు డైరెక్టర్ ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు లక్ష్మీ ఇన్ఫ్రా వారిపై కేసు నమోదు చేయించి
పనులు వారం రోజుల్లో పూర్తి పూర్తి చేయకపోతే అక్కడ ఉన్న రామరాజు నగర్ విఘ్నేశ్వర రెసిడెన్సి కాలనీ ప్రజలు నేషనల్ హైవేదిబందించడానికి కూడా వెనుకాడరని డిమాండ్ చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *