Farmers Worried Over Irrigation Water Shortage in Shayampet
అందని నీరు… ఆందోళనలో రైతులు
చివరికి నీళ్లందేనా!
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ కాలువలకు నీళ్లు వస్తున్నాయి చాలా చోట్ల పంటలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది మండలంలో నీటి అవసరం ఎక్కువగా ఉన్న తరుణంలో భూగర్భ జల మట్టం వేగంగా అడుగంటగా చివరి ఆయకట్టుకు కాలువ నీరు అందకపోవడంతో చివరి దశకు వస్తున్న పైరు నిలు వుగా ఎండిపోతున్నాయి మార్చిలోనే పరిస్థితి ఇలా ఉండగా పంటలు పూర్తిగా ఏప్రిల్ , మే మాసం వరకు పరిస్థితి విషమించి పెద్ద ఎత్తున పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు
తక్షణ చర్యలు అవసరం

శాయంపేట మండల కేంద్రంలోని రైతుల పంటలు చేతికి వచ్చే సమయంలో నీరు అందకపోకపోతే రైతుల కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యే అవకాశం ఉన్నది. కావున ఎస్సారెస్పీ నీరు అందక రైతులు నిరాశ చెందుతున్నారు ఎస్సారెస్పీ నుండి చిన్న ఉప కాలువ వరకు నీరు అందించాలని అధికారులు నిర్ణయిం చిన ఏప్రిల్ వరకు నీటి తడులకు పోడిగింపు చివరి ఆయకట్టు వరకు నీరు పారేలా చూడా లని కాలువలకు అధిక మొ త్తంలో నీటిఅవసరం ఉన్న పంట భూములకు,గొలుసు పట్టు చెరువులు కుంటల్లోకి నీటిని జలాల స్థిరంగా కొనసాగిస్తేనే పంటలను కాపాడుకోవచ్చు.
జాతీయ రహదారి బ్రిడ్జి కింద ఉన్న పైపులను తొలగించాలి

జాతీయ రహదారి ఓగు లాపూర్ నూతన బ్రిడ్జి కింద ఉన్న పైపులను తొలగిస్తే చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తేనే పంటలు సమృద్ధిగా పండుతాయి. శాయంపేట, మైలారం, ఆరేపల్లి ,పత్తిపాక రైతుల పంటలు చివరి దశలో ఉన్నాయి కాబట్టి నీళ్లు అందకపోవడంతో ఎండిపోయే పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు. నీటి ప్రవాహానికి చెత్తాచెదారం తట్టుకుని నీళ్లు రాక ఇబ్బంది పడుతున్న రైతన్నలు సొంతంగా చెత్త తీసివేయడం జరిగింది అయినా కూడా నీళ్లు చివరి ఆయకట్టు వరకు అందకపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తుంది ఇప్పటికైనా ఎస్సారెస్పీ అధికారులు స్పందించి వెంటనే ఎస్సారెస్పీ కాలువ ద్వారా సాగునీరు అందించి ఆదుకోవాలని కోరారు
