వార్డుల విభజనలో లోపించిన పారదర్శకత.

Revision MCPI leaders. Revision MCPI leaders.

వార్డుల విభజనలో లోపించిన పారదర్శకత

వెంటనే సవరించాలని డిమాండ్

నర్సంపేట మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేసిన ఎంసిపిఐ (యు) నాయకులు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల విభజన లో పారదర్శకత పూర్తిగా లోపించిందని ఎం సిపిఐ( యు) నాయకులు కన్నం వెంకన్న , వంగల రాగ సుధా , కొత్తకొండ రాజమౌళి ఆరోపించారు. ఈ సందర్భంగా నర్సంపేట మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు.ఇటీవల కొన్ని గ్రామాలను నర్సంపేట మున్సిపాలిటీలో విలీనం చేయగా , ఆ గ్రామాల ఓటర్లను రెండు ,మూడు వార్డుల్లో వేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. గ్రామాల విలీనం తో ఒకవైపు ప్రజలు ఉపాధి కోల్పోగా ,ఇది చాలదన్నట్టు ప్రజలను మరింత అస్థిరపరిచేందుకు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.అదే రకంగా పట్టణంలోని జ్యోతిబాసు నగర్ , కారల్ మార్క్స్ కాలనీలో చాలా ఏళ్లుగా సమస్యలు వెంటాడుతున్నాయని ఈ సమస్యలను పరిష్కరించడంలో పాలకవర్గాలు ఘోర వైఫల్యం చెందారన్నారు .ఇప్పటికైనా కాలనీలో అంతర్గత రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను వెంటనే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో దశలవారి ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో ఏఐసిటియు జిల్లా అధ్యక్షులు ఎండి మా షూక్ , పట్టణ నాయకులు భైరబోయిన నరసయ్య ,బెజ్జంకి పుష్పనీలా , జన్ను విజయ తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!