Workers Protest Against New Labour Codes
లేబర్ కోడ్ లకు వ్యతిరేకం గాకార్మిక సంఘాల నిరసన
కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్య తిరేక విధానాలు మానుకో వాలి
శాయంపేట నేటిధాత్రి:
కేంద్ర ప్రభుత్వం కార్మికులకు నష్టపరిచే విధంగా ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మండల కేంద్రం లో ఐఎన్ టియుసి మండల అధ్యక్షుడు మారేపల్లి రాజేందర్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా పోరాటాలు నిర్వహిం చి త్యాగాలు చేసి సాధించు కున్న కార్మిక చట్టాలను నాలు గు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి కార్పొరేట్లకు, భూస్వాములకు ఊడిగా ఊసేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత ముందుకు పోతున్నదని విమర్శించారు. అంగన్వాడీ,ఆశ,మధ్యాహ్న భోజన, గ్రామపంచాయతీ కార్మికులకు నష్టం జరిగే విధంగా, ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్మికులకు దెబ్బతీసే నాలుగు లేబర్ చట్టాలను వెనక్కి తీసు కోవాలి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డ నాటినుండి నేటి వరకు కూడా కార్మికులకు నానా విధాలుగా కష్టాలు ఎదురవుతున్నాయి. వేత నాలు నిర్ణయించే అంశాన్ని యజమాన్యాలకు వదిలేయడం ఎంతవరకు సంబంధం సబమని ప్రశ్నించారు. ముఖ్యంగా వ్యవసాయ కార్మికులకు వినాశనకరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి పెద్ద పెద్ద కంపె నీలలో పనిచేస్తున్న, గతంలో 8గంటలు మాత్రమే పనిచేసేది. ఈ చట్టాల ద్వారా 12గంటలు చేయాలి. యాజమాన్యానికి నచ్చితే పని చేయించుకుంటా రు, నచ్చకపోతే వారిని తీసేస్తా రు. యాజమాన్యానికి స్వేచ్ఛ ను కలిగించిన నరేంద్రమోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే వెనక్కితీసుకోక పోతే కేంద్రప్రభుత్వానికి బుద్ధి చెపుతామని హెచ్చరించారు
