జెన్ కో అధ్యక్షులు ఎలకంటి రగోతం
గణపురం నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం హెచ్-58 జెన్ కో అధ్యక్షులు ఎలకంటి రగోత్తం ఆద్వర్యంలో కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న అర్టీజన్ కార్మికుల సమస్యలు గురించి ఈ రోజు విద్యుత్ సౌదా లో డైరెక్టర్ హెచ్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ వారిని మర్యాద పూర్వకంగా కలిసి కెటిపిపి లోని అర్టీజన్ కార్మికులు సుదూర ప్రాంతాల నుండి వస్తున్నారు వసతి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు అర్టీజన్ కార్మికులకు వసతి గృహాలు సినియారిటి జాబితా చేసి పదోన్నతులు కల్పించి, యూనిఫాం మరియు రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే ప్రతి సంవత్సరం సబ్బులు, సరుపులు, క్లాత్ లు అందించాలని వినతిపత్రం అందజేశారు త్వరలో వీటన్నింటినీ పరిసీలన చేసి అందిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం రిజినల్ కార్యనిర్వాహక అధ్యక్షులు మామిండ్ల నాగరాజు, సభ్యులు లక్కం విజేందర్, బొమ్మకంటి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు
