బాధిత కుటుంబలను పరామర్శంచిన కుంజ కుసుమంజలిసూర్య
కొత్తగూడ, నేటిధాత్రి:
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం దుర్గారాం గ్రామానికి చెందిన జంగా సంపత్ ఎల్లయ్య ఇద్దరు సోదరులు వారి కుమార్తెలైన
జంగా మౌనిక జంగా నవ్యలత అను అక్కాచెల్లెలు. బుధవారం రోజు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగిన సంగతి విధితమే.. బాధితుల బాధను కన్నీళ్లను చూసిన స్థానిక నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు ధనసరి సీతక్క కు విషయం చెప్పడం జరిగిందని మంత్రివర్యులు సీతక్క ఆదేశాల మేరకు వారి కోడలు ములుగు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కుంజ కుసుమాంజలిసూర్య గురువారం రోజు దుర్గరాం గ్రామానికి విచ్చేసి బాధిత కుటుంబాలను ఓదార్చి కన్నింటి పర్యంతమయ్యారు
బోలెడు భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయిలు రోడ్డు ప్రమాదాలు చనిపోవడం చాలా బాధాకరమని వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చి వారికీ ప్రగడ సానుభూతిని తెలియజేసి ప్రభుత్వపరంగా బాధిత కుటుంబాలను ఆదుకుంటామని కుంజ కుసుమాంజలిసూర్య, అన్నారు వారి వెంట మాజీ ఎంపీపీ బానోత్ విజయ, రూపు సింగ్ ,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకర బోయిన మొగిలి,మాజీ జడ్పిటిసి పుల్సం పుష్పలత, టీపీసీసీ సభ్యులు చల్ల నారాయణరెడ్డి, మాజీ జెడ్పిటిసి కారోజు రమేష్, డిసిసి సభ్యులు వీరనేని వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ కాడబోయిన జంపాయ్య, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కర్ర జనార్దన్ రెడ్డి,నోముల ప్రశాంత్ యాదవ్, ఉపేంద్ర చారి, ముస్కు, వెంకన్న గొందిరాజు పల్లె రమేష్ గ్రామ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…