జర్నలిస్టుల దీక్షలకు “కుమ్మర సంఘం” మద్దతు
వరంగల్ తూర్పు, నేటిధాత్రి
తూర్పు జర్నలిస్టులకు ఇస్తామన్న డబుల్ బెడ్ రూములు ఇవ్వకపోవడంతో “ఐదవ రోజుకు” చేరుకున్న దీక్షలు. వారికి సంఘీభావంగా వెళ్ళి దీక్ష శిబిరం వద్ద మద్దతు తెలిపిన తెలంగాణ రాష్ట్ర “కుమ్మర సంఘం” అధ్యక్షుడు ఆకారపు మోహన్. ఈ సందర్భంగా ఆకారపు మోహన్ మాట్లాడుతూ తూర్పు జర్నలిస్టుల కొరకు నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇల్లులను త్వరగా వాటికి కేటాయించాలని కోరుతూ, తెలంగాణ కుమ్మర సంఘం తూర్పు జర్నలిస్టులకు మద్దతు ప్రకటిస్తు, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే మంత్రి కొండా సురేఖ స్పందించి వీరికి డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.