*ఘనంగా ఉప్పల్ నియోజకవర్గం లో శ్రీ KTR రోడ్ షో….*
*నేటిధాత్రి, హైదరాబాద్:*
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా…మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గంలో..ఉప్పల్ చౌరస్తా లో శ్రీ KTR గారి రోడ్ షో లో పాల్గొన్న మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు మరియు శాసన సభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారు, ఎన్నికల ఇంఛార్జి ఎండీ. జహంగీర్ గారు స్థానిక కార్పొరేటర్లు, తదితర ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.
నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా.. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ…
కాంగ్రెస్ వచ్చింది కష్టాలు తెచ్చింది.
24 గంటలు కరెంటు పోయింది తాగునీటి సమస్య వచ్చింది.
ఇన్వర్టర్లు జనరేటర్ల కాలం వచ్చింది.
సెంట్రల్ గవర్నమెంట్ ప్లై ఓవర్ నిర్మాణం వంటి పనులు, తీసుకున్న ఉప్పల్ కారిడార్, అంబర్ పేట ప్లై ఓవర్ నిర్మాణం పనులు నత్త నడకన నడుస్తున్నాయి.
మతం పేరు మీద రాజకీయం దేవుని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేది బీజేపీ.
తెలంగాణలో 10 12 సీట్ల లో బీఆర్ఎస్ ని గెలిపించండి రాబోయే ఆరు నెలల్లో కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసిస్తారు.
కేసీఆర్ గారు యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి గుడి కట్టినారు ఆధునిక దేవాలయాలు నిర్మించారు..
నిత్యవసర సరుకులు అన్ని ఫిరమయిందంటే కారణం మోడీ…
పార్లమెంట్లో మన గలం వినిపించాలంటే, మన ఎంపీ లను గెలిపించాలి.
అహకారంతో విర్రవీగుతున్న కాంగ్రెస్ బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారిని పార్లమెంటు కు పంపాలి.
వద్దురో కాంగ్రెస్ పాలన అని ప్రజలు మొత్తుకుంటున్నారు. ఆరు గ్యారెంటీలు అమలు కాలేదు.
రేవంత్ సర్కారు ఒక్క జాబ్ నోటిఫికేషన్ అయినా వచ్చిందా? మల్కాజిగిరి పార్లమెంట్ ప్రజలు ఆలోచించాలి.
అసలైన మార్పంటే ఏంటో చూపాలి. కేసీఆర్కు అండగా నిలబడాలి..
6 గ్యారంటీలు అమలు చేయడం చేతకాక తిట్లు, దేవుడిపై ఒట్లు.
హిందువుల ఆస్తి ముస్లింలకు పంచుతారని బీజేపీ దుష్ర్ర్ర్పచారం చేస్తోంది.
రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోంది.
ఒకర్నొకరు తిట్టుకుంటూ బీఆర్ఎస్ పార్టీని నిందిస్తున్నారు.
కాంగ్రెస్ ఓట్లు అడిగేముందు ఆరు గ్యారెంటీ లు, ఎన్నికల హమీల గురించి మాట్లాడాలి.
2014 బడే భాయ్ మోసం చేసిండు.. 2023 చోటే భాయ్ మోసం చేసిండు.
జిల్లాల్లో ప్రజలు మోసపోయిన్రు.. కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఏదో చేస్తారనుకున్నారు
ఇప్పుడు హైదరాబాద్లో పరిస్థితి ఏమైంది.. కొత్త పెట్టుబడులు తెచ్చే మొఖం లేదు.. ఉన్న కంపెనీలే తరలిపోతున్నాయి
మెడల పేగులు వేసుకుంట.. జేబుల కత్తెర పెట్టుకుంట అని అంటాడు.. ముఖ్యమంత్రి అట్ల మాట్లాడుతాడా?
లంకె బిందెలు ఉన్నాయకున్నా అంటాడు? లంకె బిందెల కోసం పచ్చి దొంగలు కదా తిరుగేది?
ఈరోజు నిర్మల్ లో రాహుల్ గాంధీ ఆరు గ్యారెంటీ లలో ఐదు గ్యారంటీలు అమలు చేసినమంటూ సిగ్గులేకుండా అబద్దాలు చెప్తుండు.
మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ..
గత 25 సంవత్సరాలుగా ప్రజా క్షేత్రం లో ఉన్నాను.
ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను.
కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకున్నాను.
ఇప్పుడు కేసీఆర్ గారు ఆశీర్వదించి నాకు మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ గా పోటీ చేసే అవకాశం ఇచ్చారు.
దయచేసి ఒక్క అవకాశం ఇచ్చి, ఆశీర్వదించండి.భారీ మెజారిటీతో గెలిపించండి.
ఎందుకంటే మల్కాజిగిరి పార్లమెంట్ ప్రజల మీద ప్రేమ లేని వారికి, పరిపాలన అంటే తెలియని వాళ్లకు, ఎక్కడో హుజురాబాద్ , తాండూరు లో ఉండే వాళ్లకు, కరోన కష్ట కాలంలో ప్రజలను పట్టించుకోని బీజేపీ, కాంగ్రెస్ నాయకులను నమ్మొద్దు అన్నారు.
తెలంగాణ రాష్ట్రంను అద్భుతంగా అభివృద్ధి చేసినది కేసీఆర్ గారు…
హైదరాబాదును విశ్వనగరంగా తీర్చి దిద్ది, ప్రపంచ పటంలో నిలిపినది కేటీఆర్ గారు..
హైదరాబాదులో 10 ఏళ్ల ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కట్టినారు.
ఎల్బీనగర్, ఉప్పల్ లో స్కై వేలు అండర్ పాసులు నిర్మించారు
ఆరు గ్యారెంటీ లలో ఐదు గ్యారంటీలు అమలు చేసినమంటూ సిగ్గులేకుండా అబద్దాలు చెప్తుండు.
మే 13 న జరిగే మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల్లో EVM ప్యాడ్ లోని సీరియల్ నెం. 4 పై నొక్కి కారు గుర్తుకి ఓటేసి గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో.. ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ,కార్యకర్తలు మహిళలు,అభిమానులు, తదితరులు వేల సంఖ్యలో పాల్గొన్నారు.