`నో స్పేస్..నో గ్యాప్.. కేటీఆర్ బీఆర్ఎస్ బాస్!
`నో సెకెండ్ ధాట్…హరీష్ రావు పవర్ పుల్ క్లారిటీ
`కేసీఆర్ అడుగుజాడల్లోనే…కేటీఆర్ నడిచే దారిలోనే!
`బీఆర్ఎస్కు నవ యుగం..కేటీఆర్కు పట్టం!
`భవిష్యత్తు బీఆర్ఎస్ సీఎం కేటీఆర్!
`బీఆర్ఎస్కు యువ నాయకత్వంతో ఉరకలు
`అన్ని నియోజకవర్గాలలో నవ నాయకత్వం
`హరీష్ రావు మరో సారి పూర్తి స్పష్టత
`కవిత కూడా చెబుతున్నది అదే మాట
`మేమంతా అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఒక్కటే…
`మా ముందున్న లక్ష్యం బీఆర్ఎస్ను అధికారంలోకి తేవడమే!
`బీఆర్ఎస్ ఛీలాలనే పాలక పక్షం కలలు నెరవేరేది లేదు
`కాంగ్రెస్ కుట్రల రాజకీయం తీరేది కాదు
`ముగ్గురి మధ్య దూరానికి చోటు లేదు
`తెలంగాణ వున్నంత వరకు బిఆర్ఎస్ వుంటుంది
`బీఆర్ఎస్ మరో వందేళ్ళు కొనసాగుతుంది
`బీఆర్ఎస్ శ్రేణులలో పెరిగిన జోష్
`ఈసారి ఉద్యమ కారులకు పెద్ద పీట
`యాభై సీట్లలో కొత్త వారికి కోట!
`సీనియర్లకు పార్టీ పదవులు… యువ నాయకులకు పాలనలో ప్రాధాన్యతలు
హైదరాబాద్,నేటిధాత్రి:
ఒక్కమాట..ఒకే ఒక్క మాట…అంతే బిఆర్ఎస్ మీద లేని పోని రాద్దాంతం చేసేవారి నోళ్లు మూయించాయి. లేని పోని రాతలు రాసే మీడియాకు అవకాశం లేకండాపోయింది. రకరకాల వదంతులకు చెక్ పెట్టాయి. అయితే అది ఇప్పుడు కొత్తగా చెప్పిన మాట కాదు. కాని సమయం, సందర్భం అన్నది కూడా దేనికైనా కలిసిరావాలంటారు. ఇప్పుడొచ్చింది. మళ్లీ ఆ ప్రశ్నకు తావులేకుండా పుల్ స్టాప్ పడిరది. అదే కేటిఆర్కు పార్టీ పగ్గాలు అప్పగించే అంశం. బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఏది చెబితే అదే నాకు శిరోదార్యం అని మరోసారి మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు హరీష్రావు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మరోసారి ఈ విషయం ఎవరూ ప్రస్తావించొద్దు. బిఆర్ఎస్లో ఆధిప్యత పోరు అన్నదానికి తావే లేదన్నారు. తనపై వస్తున్న అసత్యపూరితమై వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని నిగ్గు తేల్చారు. కేసిఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి నూటికి నూరు పాల్లు కట్టుబడి ఇప్పటి వరకు పనిచేశానన్నారు. ఇకపై కూడా అలాగే వుంటుందన్నారు. బిఆర్ఎస్లో తాను ఒక సామాన్య కార్యకర్తలని అని అన్నారు. కేసిఆర్ అడుగుజాడల్లో నడవడమే నా పని అని చెప్పారు. రకరకాల రూమర్లకు ప్రతీసారి సమాధానం చెప్పడం అవసరం లేదని, ఇది ఆఖరు అని అటు మీడియాకు, ఇటు ఇతర రాజకీయ పార్టీలకు చెప్పారు. తెలంగాణలో వున్న బలమైన పార్టీ బిఆర్ఎస్. బిఆర్ఎస్ను మించిన పార్టీ లేదు. అడ్డిమార్ గుడ్డి దెబ్బ అన్నట్లు జనానికి పదే పదే లేనిపపోనివి చెప్పి కాంగ్రెస్ నమ్మించింది. అయినా ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ను నమ్మలేదు. అందుకే బిఆర్ఎస్ను బలమైన ప్రతిపక్షంగా కూర్చోబెట్టారు. దాంతో ఊపిరి సలపని కాంగ్రెస్ రకరకాల విన్యాసాలు చేస్తోంది. బిఆర్ఎస్కు చెందిన పది మందిని లాక్కున్నది. వారి పరిస్దితి ఎలా వుందో చూస్తూనే వున్నాం. అయినా కాంగ్రెస్ ఆశ చావడం లేదు. బిఆర్ఎస్లో ఏదో సృష్టించాలని, రకరకాల పుకార్లు ప్రచారం చేసి కాలం గడుపుకుందాని అనుకుంటోంది. ఎందుకంటే ప్రజలకు బిఆర్ఎస్ విషయాలంటే ఆసక్తి ఎక్కువ. బిఆర్ఎస్ తెలంగాణ ప్రజల పార్టీ. తెలంగాణ ఇంటి పార్టీ. తమ ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఎదురౌతుందనుకుంటే సహజంగా కుటుంబ సభ్యులు కొంత కలవరపడుతుంటారు. ఇక్కడా అదే జరుగుతోంది. బిఆర్ఎస్లో అందరూ కలిసి వుండాలని ప్రజలు కూడా బలంగా కోరుకుంటున్నారు. అప్పుడూ, ఇప్పుడు అలాగే వున్నారు. ఎప్పుడూ అలాగే వుంటారు. కాని కేటిఆర్, కవిత, హరీష్ రావుల మధ్య ఎప్పటికిప్పుడు ఏదో వివాదం నడుస్తోందని ప్రచారం చేసుకోకపోతే కాంగ్రెస్క కాలం గడవదు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో వున్నప్పుడూ అదే చేసింది. ఇప్పుడు అధికారంలో వున్నా అదే మాట్లాడుతోంది. కాంగ్రెస్కు అభివృద్ది చేత కాదు. ఎన్నికల హమీలు అమలు చేయలేరు. కాంగ్రెస్లో వున్న కుంపట్లు ఆరేవి కాదు. ప్రజలు దృష్టి అటు వైపు వెళ్లకుండా వుండాలంటే బిఆర్ఎస్ను ప్రతిసారి తెరమీదకు తెస్తే తప్ప పూట గడిచే రోజు కాంగ్రెస్కు లేదు. అందుకే ప్రభుత్వంలో వున్నా, బిఆర్ఎస్ జపం చేయకపోతే కాంగ్రెస్కు క్షణం కూడా గడిచేలా లేదని హరీష్ రావు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. దాంతో ఇక కాంగ్రెస్ కూడా ఇకపై పుకార్లు పుట్టించే పరిస్దితి లేకుండాపోయింది. అన్ని దారులు హరీష్రావు ఒక్క మాటతో మూసేశారు. ఎమ్మెల్సీ కవిత కూడా అదే మాట అనేక సార్లు చెప్పింది. చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడు రాజకీయ పార్టీలు ఎదుటి పార్టీ మీద రాళ్లేస్తుంటారు. కాంగ్రెస్ ఇప్పటి వరకు అదే చేస్తూ విచ్చంది. ఇంకా అదే పనిలో వుంది. కాని ఇకపై మరో అస్త్రం ఏదో సిద్దం చేసుకుంటే గాని కాంగ్రెస్కు పని వుండదు. నిజం చెప్పాలంటే బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఎంతో ఆరోగ్యంగా వున్నారు. ఇంకా రెండు మూడు ఎన్నికలు ఎదుర్కొనేంత శక్తితోనే వున్నారు. కాని తెలంగాణ అంటే గిట్టని వాళ్లు, తెలంగాణ బాగుండడం చూడలేని వాళ్లు, కేసిఆర్ రాజకీయాలు ఆగం కావాలని చూసే వాళ్లు చాల మంది వున్నారు. తెలంగాణలో కేసిఆర్ అనే ఒక్క పదం వినిపించకపోతే మేమే నాయకులం అని గొప్పలు చెప్పుకోవడానికి పాలకపక్షం కాంగ్రెస్లో, కేంద్ర పాలకపక్షం బిజేపి వుంది. కాని ఆ అవకాశం ఎవరికీ రాకపోవచ్చు. కేసిఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్ది రోజులకే ఆయన ఆరోగ్యం బాగాలేదంటూ మీడియాల్లో నిత్యం కథనాలు వచ్చేవి. అలా ఆ ఐదేళ్లు కాంగ్రెస్తోపాటు, మీడియా కొంత కాలం గడిపింది. ఆ సమయంలో కేసిఆర్ నిండు అసెంబ్లీ సాక్షిగా నేను దుక్కలాగా వున్నారు. నేను ఇంకా మరో పదిహేను, ఇరవై ఏళ్లు రాజకీయాల్లో వుంటాను. నా ఆరోగ్యం కాంగ్రెస్ పార్టీకి, మీడియాకు ఎంత ప్రేమో అంటూ ఎద్దేవా చేశారు. కేసిఆర్ గురించి అలా అనుకునేవారు అనుకుంటూనే వుంటారు..నేను మరో ఇరవై ఏళ్లు రాజకీయం చేస్తానని ఎంతో నమ్మకంగా కేసిఆర్ చెప్పారు. ఇక కేసిఆర్ ఆరోగ్యంపై కాకుండా కేటిఆర్ సిఎం కావాలన్న దానిపై ఓ రెండుమూడేళ్లు కాంగ్రెస్ రకరకాల ప్రచారాలు సాగించారు. మీడియాలో కూడా కేటిఆర్ సిఎం. అనేది ఓ నాలుగైదు సంవత్సరాలుగా నానుతూనే వుంది. ఇంకా ఆ చర్చ సాగుతూనే వుంది. గత ఎన్నికల సమయంలో ఇంకా బాగా సాగింది. హరీష్రావుతో పాటు, పార్టీలోని అనేక మంది నాయకుల అభిప్రాయాలు కూడా అందరికంటే ముందుగా మీడియానే సేకరించింది. అనూహ్యంగా బిఆర్ఎస్ గత ఎన్నికల్లో ఓడిపోయింది. దాంతో మళ్లీ భవిష్యత్ బిఆర్ఎస్ నాయకుడు ఎవరు? అన్న చర్చ మళ్లీ మొదటికి వచ్చింది. కాదు కాంగ్రెస్,బిజేపి మీడియాతో కలిసి తెరమీదకు తెచ్చింది. ఇదే అదునుగా హరీష్రావు ఎంతో అసంతృప్తిగా వున్నారంటూ లేనిపోని వార్తలు సృష్టించారు. ఏకంగా హరీష్రావు కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారంటూ కాంగ్రెస్కు చెందిన సోషల్ మీడియాతోపాటు, ప్రధాన పత్రికలు కూడా వార్తలు వండి వార్చాయి. మరికొన్ని మీడియా సంస్దలు హరీష్రావు బిజేపిలోకి వెళ్తున్నట్లు ప్రచారం చేశాయి. హరీష్రావు ప్రాధాన్యత తగ్గిస్తున్నారంటూ పుకార్లు లేచాయి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు రోజుకో రకమైన వార్త సృష్టించడం మొదలుపెట్టారు. బిఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాటు హరీష్రావుకు అప్పగించలేదని మొదలు పెట్టారు. హరీష్ను పక్కన పెట్టే సమయం ఆసన్నమైందన్నారు. ఇక ఎమ్మెల్సీ కవిత విషయంలో కూడా అదే జరుగుతోంది. కవితను కూడా పార్టీ నుంచి సాగనంపే కుట్రలు జరుగుతున్నాయని కూడా వార్తలు వచ్చాయి. ఆమెను కూడా రజతోత్ససభకు దూరం పెట్టారన్నారు. కవిత ఎంచుకున్న బిసి నినాదం పార్టీలో ప్రకంపనలు సృష్టించిందన్నారు. కేసిఆర్ కవితను తన ఇంటికి కూడా రానివ్వడం లేదని కూడా అనేక వార్తలు వస్తున్నాయి. అంతే కాదు కవిత మొదటి నుంచి ప్రత్యేకశైలిలో రాజకీయాలు నెరపడం తెలుసు. నాయకత్వం పటిమ ఆమెలో వుందని చెబుతూనే, కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ కూడా వార్తలు రాస్తున్నారు. అన్నతోఆమెకు పడడం లేదని లెక్కలేశారు. ఇటీవల కవిత చేసిన సామాజిక తెలంగాణ అంశం బిఆర్ఎస్ నుంచి కవిత దూరం కావడానికే చేసిందన్న వార్తలు కూడా వచ్చాయి. ఆమె కంట తడి పెట్టుకోవడం కూడా బిఆర్ఎస్ పెద్దల వైఖరి నచ్చకనే అంటూ వార్తలు రాసుకొచ్చారు. ఇలా బిఆర్ఎస్లు కలతలు నింపే ప్రయత్నాలు బోలెడు చేస్తూనే వున్నారు. అయినా కేటిఆర్, హరీష్రావు, కవితల మధ్య సఖ్యతకు గండికొట్టలేరన్నది తేలిపోయింది. వారి ఐక్యతను జీర్ణించుకోలేక ఇలాంటి ప్రకటనలు కాంగ్రెస్ సోషల్ మీడియా పదే పదే చేస్తూనే వుంది. ఇంకా చేస్తూనే వుంటుంది. కాని బిఆర్ఎస్లో ఎలాంటి అరమరికలులేవు. అయినా ఇప్పుడు ఆ ప్రచారానికి తావే లేదు. వచ్చే ఎన్నికలు కేటిఆర్ నాయకత్వంలో వెళ్లరు. కేసిఆర్ ఇంకా బలంగానే వున్నారు. కాంగ్రెస్, బిజేపిలను ఇంకా పదేళ్లుపాటు ఎదుర్కొనే శక్తితోనే వున్నారు. ఇప్పటికిప్పుడు కేసిఆర్కు వచ్చిన ఇబ్బందేమీ లేదు. కాకపోతే భవిష్యత్ బిఆర్ఎస్ నాయకుడు కేటిఆర్ మాత్రమే అని అందరూ చెబుతున్నదే. ఇందులో మరో ప్రశ్నకు తావులేదు. అలాంటి పరిస్దితులు ఉత్పన్నమయ్యే సమస్యే లేదు. ఎంత కాలమైనా బిఆర్ఎస్ భవిష్యత్తు నాయకుడు కేటిఆరే అవుతారు. అది ఇప్పటికే కేసిఆర్ కూడా అనేక సంకేతాలు పంపారు. 2018 ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలిచిన వెంటనే కేటిఆర్ను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటును చేశారు. ఇంతకన్నా స్పష్టత మరొకటి వుండదు. ఇది పదే పదే చెపాల్సిన పనిలేదు. బిఆర్ఎస్లో లేనిపోని రాద్దాంతాలను ఎవరూ సృష్టించాల్సిన పనిలేదు. బిఆర్ఎస్ పార్టీని ఎంతో పదిలంగా, ఉద్యమ రణరంగంలో ధైర్యంగా నిలుపుకుంటూ 25ఏళ్లు కాపాడుకున్నారు. ఆ బంధాన్ని కుటుంబ సభ్యులెలా వదులుకుంటారు? ప్రచారం చేసేవారికి కొంచెమైనా వుండాలి?