
KTPP employee Niranjan Reddy, who received a doctorate
డాక్టరేట్ పొందిన కెటిపిపి ఉద్యోగి నిరంజన్ రెడ్డి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న పల్లెర్ల నిరంజన్ రెడ్డి డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్ 2025 సంవత్సరమునకు గాను గ్లోబల్ హుమెన్ పీస్ యూనివర్సిటీ యూనివర్సిటీ యు ఎస్ ఏ ప్రకటించింది. అనివార్య కారణాల వల్ల 28/06/2025 రోజున చెన్నయ్ స్నాతకోత్సవంలో పాల్గొన లేకపోయారు ఈ డాక్టరేట్ ని గ్లోబల్ హుమెన్ పీస్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కందుకూరి విజయ్ మోహన్, సేవా రత్న జాతీయ అవార్డు గ్రహీత యునివర్సిటీ సభ్యులు బొమ్మకంటి రాజేందర్ ల ఆధ్వర్యంలో ఈ రోజు హానరరి డాక్టరేట్ పట్టా ప్రదానోత్సవం కెటిపిపి చీఫ్ ఇంజనీర్ చిట్టాప్రగడ ప్రకాష్ చేతుల మీదుగా జెన్ కో కాలనీలో నిరంజన్ రెడ్డి కి అందజేశారు
ఈ సంధర్భంగా గ్లోబల్ హుమెన్ పీస్ యూనివర్సిటీ సంఘ సేవకులకు, రచయితలకు, కవులకు మరియు అత్యంత ప్రతిభావంతులైన వారిని గుర్తించి ఈ గౌరవ డాక్టరేట్ అవార్డును అందజేయడం అందులో క్యాతపల్లి గ్రామ వాస్తవులైన పల్లెర్ల పుల్లారెడ్డి పూలమ్మ దంపతుల కనిష్ట కుమారుడైన పల్లెర్ల నిరంజన్ రెడ్డి మా కెటిపిపి ఇంజనీర్ కి అంతర్జాతీయ స్థాయి స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ పట్టా పొందడం గర్వించదగ్గ విషయం అని మీ అత్యుత్తమ కృషి మరియు విజయాలకు గుర్తింపుగా, ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్ అవార్డును ప్రదానం చేయడానికి మేము సంతోషిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ రామ ముత్యాల రావు, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ లు కాటం రవి, మాకుల సంతోష్, జెరిపోతుల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు