కొత్తగూడ, నేటిధాత్రి :
మహబూబాబాద్ జిల్లా
కొత్తగూడ మండల కేంద్రంలోని
జేఎల్ఎన్ వైసీ యూత్ క్లబ్ మరియు అధ్యక్షులు మల్లెల రణధీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి పూజ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న కొత్తగూడ ఎస్సై కుశకుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు సందర్భంగా ఎస్ఐ కుషకుమార్ మాట్లాడుతూ వినాయక నిమజ్జన కార్యక్రమంలో యువత తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిమజ్జనం సమయంలో చిన్న పిల్లలను చెరువు వద్దకు తీసుకువెళ్లరాదని ఊరేగింపు సమయంలో డిజె సౌండ్ లు పెట్టరాదని యూత్ క్లబ్ సభ్యులు తగు జాగ్రత్తలు తీసుకొని నిమజ్జనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు… ఈ కార్యక్రమంలో విగ్రహ దాత కుందారపు సత్యనారాయణ. మాజీ ఎంపీటీసీ హలవత్ సాలుకి సురేష్. మాజీ వైస్ ఎంపీపీ పూల యాదగిరి. గ్రామ పెద్దమనిషి కంగల సూరయ్య. వజ రాహుల్. వేంపల్లి కృష్ణ.కంగాల నాగేశ్వరావు. అమర్.సిరిగిరి సురేష్. ఎండీ ఇమ్రాన్.కంగాల శేఖర్. యూత్ సభ్యులు.తదితరులు పాల్గొన్నారు…