
కోర్వి కృష్ణ స్వామి జయంతి: ముదిరాజ్ సంఘం ఘన నివాళి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజ్ వ్యవస్థాపకుడు కోర్వి కృష్ణ స్వామి జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం పెద్దలు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.