మంగళహారుతులు పట్టి బతుకమ్మ ఆడుతూ,కోలాటం వేస్తూ ఘన స్వాగతం పలికిన మహిళలు!!!
పల్లెపల్లెన ప్రభుత్వ పథకాల ప్రచారం
పెద్దఎత్తున పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు, కొప్పుల అభిమానులు
ఎండపల్లి, (జగిత్యాల) నేటి ధాత్రి, ధర్మపురి నియోజక వర్గం ఎండపల్లి మండలంలో లో రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం లో భాగంగా ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. మారేడుపల్లి, ముంజంపల్లి, ఉండడ గ్రామాల్లో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. గ్రామ గ్రామాన మంత్రి కొప్పుల ఈశ్వర్ కు మహిళలు మంగళహారతులు పట్టి..బతుకమ్మ, కోలాటాలతో ఘనస్వాగతం పలికారు.
గ్రామాల్లో కాలి నడకన వీధివిది తిరుగుతూ గ్రామస్తులతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పని తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో చిన్నా పెద్ద తేడా లేకుండా భారీగా తరలివచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ వివరించారు. కాంగ్రెస్ నేతలు 70 ఏళ్లుగా మాయ మాటలు చెబుతూ అధికారంలో కొనసాగారు తప్ప..ప్రజలకు ఎలాంటి మేలు చేకూర్చలేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఎన్నికల ముందు మాత్రమే ప్రజల ముందుకు వచ్చి అఢ్డగోలు హామీలు ఇస్తూ మోస గించడమే వారి లక్ష్యం అన్నారు. గత పాలకులు షూరిటీ ఉన్న వారికే ప్రభుత్వ రుణాలు అందించే వారని…ఏ కొందరికో ప్రభుత్వ పథకాలు దక్కేవన్నారు. అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి షరతులు లేకుండానే అర్హులకు రుణాలు అందించడమే కాకుండా.. ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఎవరు ఏ రంగంలో స్థిరపడాలనుకుంటే వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ అలాంటి అవకాశం కల్పించారని మంత్రి కొప్పుల చెప్పారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలంతా కేసీఆర్ కు బాసటగా నిలిచారని.. రాబోయే ఎన్నికల్లోనూ మరోసారి అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా దళిత వర్గాల అభ్యున్నతి కోసం దళితబందు లాంటి పథకం అమలు చేసి అభివృద్ధి పరిచారన్నారు. 40 వేల మంది దళితులు వారి జీవితాల్లో వెలుగులు నింపుకున్నారని చెప్పారు. రకరకాల వ్యాపారాలు ప్రారంభించి.. పది మందికి ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు. రాబోయో తొమ్మిదేళ్లలో రాష్ర్టంలోని దళితులందిరికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇళ్లు లేని వారి కోసం గృహలక్ష్మి పథకం ద్వారా ఇళ్లు కట్టిస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రజలను తప్పు దోవ పట్టించాలనుకుంటే అది ఎవరి వల్ల కాదన్నారు. రైతులకు అవసరమైన విద్యుత్, నీళ్లు అందించిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందని.. ఇదే విషయం గ్రామాల్లో ఏ ఒక్కరిని అడిగినా చెబుతారన్నారు. అంతేకాదు.. పెన్షన్లు, ఇచ్చి రోడ్డు వేసి గ్రామాలను అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం అని ఘంటాపథంగా చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న మహారాజు
అన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా పధకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఆసరా పెన్షన్లను పెంచుతున్నారని, వికలాంగులకు ఇచ్చే పెన్షన్లు, రైతుబంధు కింద ఇచ్చే నిధులు పెంచాతామని ఎన్నికల మ్యానిఫెస్టో లో పెట్టారని చెప్పారు. అదేవిధంగా 400 రూపాయలకే గ్యాస్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పేద కుటుంబాల పిల్లలకు కల్యాణ లక్ష్మి, షాదీముభారక్ అమలు చేశామన్నారు. కంటి వెలుగు ద్వారా వెలుతురు నిచ్చారని చెప్పారు. ఒక్క ముంజంపల్లి లోనే ఆరు కోట్ల అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. ఇవే కాకుండా రైతు బంధు, సీఎం ఆర్ ఎఫ్ నిధులు మంజూరు చేసుకున్నామని చెప్పారు.ప్రభుత్వం మంచి పథకాలు అమలు చేస్తుంటే ప్రోత్సహించాల్సింది పోయి.. తమ స్వలాభం కోసం లేని పోని..పసలేని విమర్శలు చేయడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు కేవలం పదవులకోసం పాకులాడుతున్నారు తప్ప.. ప్రజా క్షేమాన్ని కాదన్నారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తామంటే ఎవరు నమ్ముతారని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. వాస్తావాలు చెప్పే వారి మాటలు మాత్రమే ప్రజలు విశ్వసిస్తారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లోనూ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని గ్రామస్తులను కోరారు. సంపూర్ణమైన ఆశీర్వాదం ఇవ్వాలని కోరారు. ఎవరూ ఎన్ని మాటలు చెప్పినా నాతోకలిసి వస్తారని ఆశిస్తున్నానని చెప్పారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్ వెంట ఎన్నికల ప్రచారం లో ఎంపిపి అనసూర్య రాంరెడ్డి. వివిధ గ్రామాల సర్పంచ్ లు ,మాజీ జీడ్పిటీసి అనిత, హరీష్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్, మండల పార్టీ అధ్యక్షుడు జగన్ పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.