కారేపల్లి నేటి ధాత్రి
సింగరేణి మండల కేంద్రము లో ఆదివాసి అడవి తల్లి ముద్దు బిడ్డ ఆదివాసి హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసి అమరుడైన గిరిజన ఆరాద్య దైవం అయిన ఆ మహనియుడు కోమరం భీమ్ జయంతి వేడుకల సందర్భంగా మండలం లోని పోలీసు స్టేషన్ ఏరియా లోగల కోమరంభీమ్ విగ్రహాన్ని కి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో మండలం లోని ఆదివాసి సంఘం జీల్లా అద్యక్షుడు పూనెం శివరాం జీల్లా ప్రదాన కార్యదర్శి తాటి రాంప్రసాద్ జీల్లా ఉపాధ్యక్షుడు ఈసాల రాంబాబు సింగరేణి మండల కార్యదర్శి ఈసం భాస్కర్ చుంచు వేంకటేశ్వర్లు గలిగ రాజేష్ (పండు) తదితరులు పాల్గొన్నారు.