కొడంగల్, సిరిసిల్ల ఎక్కడికైనా నేను రెడీ

– రైతు రుణమాఫీ పూర్తయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా
– బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు
సిరిసిల్ల(నేటి ధాత్రి):
కెసిఆర్ సర్కారు ఉన్నప్పుడు నార్లు పడేటప్పుడు రైతుబంధు పడేదని కాంగ్రెస్ ను నమ్ముకుంటే ఓట్ల అప్పుడు మాత్రమే రైతుబంధు పడుతుందని బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు అన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సిరిసిల్లలో సుడిగాలి పర్యటన చేశారు తెలంగాణ భవనంలో ఈరోజు ఆయన కార్యకర్తలను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ
కొడంగల్, సిరిసిల్ల ఎక్కడికైనా నేను రెడీ.. ఒక వేళ రైతు రుణమాఫీ పూర్తయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు.కేసీఆర్ ఉన్నప్పుడు నార్లు పడేటప్పుడు రైతు బంధు పడితే.. కాంగ్రెస్ వాళ్ళను నమ్ముకుంటే ఓట్లు పడేటప్పుడు పడతాయన్నారు. ఇప్పుడు కొత్తగా రైతు భరోసా కోసం రైతులు హామీ పత్రాలు ఇవ్వాలని కొరివి పెడుతున్నారని ఆరోపించారు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదని కటింగ్ల మినిస్టర్ అని అన్నారు.కాళేశ్వరంను మొత్తం బద్నాం చేసారు.అక్కడ భూకంపం వచ్చినా ఏం కాలేదు అన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని ఎన్ని కేసులు పెట్టిన ఎదుర్కోవడానికి పార్టీ ముందుంటుందని అన్నారు. కేసులు వాదించేందుకు ప్రత్యేకంగా న్యాయవాదులను నియమిస్తాం అన్నారు.లీకులు ఇచ్చి మమ్మల్ని బద్నాం చేసేందుకు యత్నించిన వాళ్ళను తప్పకుండా కోర్టుకు ఈడుస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి , మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!