రామకృష్ణాపూర్, నేటిధాత్రి;
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపటి నుండి రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో ఖోలే ఇండియా గేమ్స్ లో భాగంగా సౌత్ ఇండియా మహిళల అండర్ 13 ఫుట్ బాల్ ఛాంపియన్షిప్ గేమ్స్ నిర్వహిస్తున్నామని జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పిన్నింటి రఘునాథరెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఏడు జట్లు పాల్గొననున్నాయని,ఐదు రోజులపాటు మొత్తం 15 మ్యాచులు నిర్వహిస్తామని అన్నారు.ఈ మెగా ఈవెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ , జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ లు పాల్గొంటారని అన్నారు . ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, ఏ ఈ అచ్యుత్, పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు,గోపతి రాజయ్య, గాండ్ల సమ్మయ్య, ఒడ్నాల శ్రీనివాస్, పిఈటి బెల్లం శ్రీనివాస్,వెంకట్ రెడ్డి,బోనగిరి రవీందర్, కుర్మ సురేందర్, రామ కృష్ణ లు పాల్గొన్నారు.