వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి జిల్లా చందాపూర్ గ్రామానికి చెందిన పి దివాకర్ ప్రమాదంలో కాలుకు గాయం అయినద ని ఆయన తల్లిదండ్రులు నాటు వైద్యం చేయించడం వల్ల కాలుకు ఇన్ఫెక్షన్ అయిందని తెలంగాణ జిల్లా జన సమితి జిల్లా అధ్యక్షులు ఎంఏ ఖాదర్ పాషా తెలిపారు. ఈ మేరకు ఆయనను పరామర్శించారు . ఆర్థోపెడిక్ డాక్టర్ షఫీ ఉల్లా ను బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు . బాధితుడికి ప్రత్యేక శ్రద్ధతో మెరుగైన వైద్యం అందిస్తానని డాక్టర్ హామీ ఇచ్చారని ఖాదర్ పాషా తెలిపారు
నాటు వైద్యం వికటించి కాలుకు ఇన్ఫెక్షన్ బాధితుని పరామర్శించిన ఖాదర్
