ఖబడ్దార్ ఒంటెద్దు నరసింహారెడ్డి.

ఖబడ్దార్ ఒంటెద్దు నరసింహారెడ్డి.

ఉత్తమ్ కుమార్ రెడ్డిని విమర్శించే అర్హత నరసింహారెడ్డి, రఘు లకు లేదు

ఉత్తమ్ కుమార్ రెడ్డికి భేషరతుగా క్షమాపణ చెప్పాలి

కోదాడ మండల అధ్యక్షులు తుమాటి వర ప్రసాద్ రెడ్డి

కోదాడ, నేటి ధాత్రి :

 

రాష్ట్ర భారీ నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని విమర్శించే అర్హత బిఆర్ఎస్ నాయకులు ఒంటెద్దు నర్సింహరెడ్డి, పిల్లుట్ల రఘ లకు లేదని వారి స్థాయి మరిచి విమర్శిస్తే కాంగ్రెస్ పార్టీ కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఊరుకోరని కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఇర్ల సీతారామి రెడ్డి, ముదిరాజు సంఘం రాష్ట్ర నాయకులు భాష బోయిన భాస్కర్ లు ఖండించారు మంగళవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో వరప్రసాద్ రెడ్డి నివాస గృహములో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. హుజూర్నగర్ కు చెందిన పిల్లుట్ల రఘు అనే వ్యక్తి బిఆర్ఎస్ లో చేరుతున్న సందర్భంగా ఆ పార్టీ నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై దుర్మార్గంగా మాట్లాడడం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తుందన్నారు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసిన శాసనసభ ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ మెజార్టీ వచ్చిందన్నారు. గ్రామంలో ఏమి చేయలేక ఒక ముఠాగా ఏర్పడి దోచుకున్న చరిత్ర ఒంటెద్దు నరసింహారెడ్డిది అన్నారు. ముఖ్యమంత్రి మంత్రులపై అర్థరహిత విమర్శలు చేస్తే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని అన్నారు. కోదాడ నియోజకవర్గంలో హుజూర్నగర్ నియోజకవర్గాలలో వారి పర్యటనలు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకొని తిరగనివ్వరని హెచ్చరించారు. ఈ ఇరువురు నాయకులు స్థాయిని గుర్తుంచుకొని మాట్లాడాలని లేనిపోని విమర్శలు చేస్తే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈడ్చి రోడ్డుకు కొడతారని హెచ్చరించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అవినీతి మచ్చలేని అనేక అభివృద్ధి పనులను ప్రజలు గమనిస్తున్నారన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గం 200 కోట్లతో నిర్మిస్తున్న 2160 ఇండ్లు కంటికి కనిపించట్లేదా, ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్లను అభివృద్ధి చేయడం కూడా దుర్మార్గమా అని అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని మీరు దుర్మార్గులని ఇప్పటికైనా అబద్దపు అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు. ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పై చేసిన విమర్శలను తాము వదిలేది లేదని ఈ విషయంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టు నోటీసులు కూడా అందిస్తామన్నారు. ఒంటెద్దు నరసింహారెడ్డి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి బహిరంగ క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అనంతరం కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఒంటెద్దు నరసింహారెడ్డి పిల్లుట్ల రఘు లపై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మందుల నాగయ్య, ఉపసర్పంచ్ ఇర్ల జయసింహారెడ్డి, గణపవరం గ్రామ సర్పంచి బల్గూరి స్నేహ దుర్గయ్య, రామలక్ష్మీ పురం సర్పంచ్ తులసమ్మ గంగిరెడ్డి, కన్నా రెడ్డి, కూచిపూడి తండా సర్పంచ్ హాజీ నాయక్, దొరకుంట గ్రామ సర్పంచ్ పాలకి సురేష్, కాంగ్రెస్ నాయకులు మండలపు శేషు, ఇర్ల నరసింహారెడ్డి, పులి ఇస్సాకు, ప్రసాద్ రెడ్డి,ముకుంద,కాంగ్రెస్ పార్టీ గుడిబండ గ్రామ అధ్యక్షులు ఎస్కే రఫీ, గ్రామ పెద్దలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version