కేసిఆర్‌ పాలనే సంక్షేమ తెలంగాణ

https://epaper.netidhatri.com/

వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో మాట్లాడుతూ ప్రజాసంక్షేమ సారథి ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనలో తెలంగాణ సుభిక్షంగా విలసిల్లుతోందన్నారు. వర్ధన్నపేట అభివృద్ధి కి అన్ని విధాల ఆశీర్వదించిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం చేయాలని కోరుతూ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే…

`కేసిఆర్‌ తెలంగాణ అశ, స్వాస.

`కేసిఆర్‌ బాధ్యతగల నాయకుడు. తెలంగాణ తెచ్చిన యోధుడు.

`ప్రతిపక్షాలలో అధికారం కోసమే వున్న నాయకులు.

`తెలంగాణ అభివృద్ధిని ప్రశ్నించే నైతికత ప్రతిపక్షాలకు లేదు.

`యాభై ఏళ్లు పాలించి, తెలంగాణను పీల్చి పిప్పి చేశారు.

`అలాంటి తెలంగాణ ను కేసిఆర్‌ బంగారు తెలంగాణ చేశారు.

`ఆకుపచ్చ తెలంగాణ బహుమతిగా ఇచ్చారు.

`ఆరోగ్య తెలంగాణ నిర్మాణం చేశారు.

`సంక్షేమ తెలంగాణ సుసంపన్నం చేశారు.

`అన్ని వర్గాల అభ్యున్నతికి తెలంగాణ చిరునామా చేశారు.

`చెదిరిన చేతివృత్తులకు తిరిగి కళ తెచ్చిన స్వాప్నికుడు.

`పల్లెలే దేశానికి పట్టుగొమ్మలని నమ్మి తీర్చిదిద్దిన నాయకుడు.

`ఒకనాడు మెతుకుకు ఏడ్చిన తెలంగాణ ను దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెచ్చారు..

`ఆ మెతుకు జిల్లా మేలిమి వజ్రం మన కేసిఆర్‌.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

దేశంలోనే ముఖ్యమంత్రి కేసిఆర్‌ లాంటి సంక్షేమ సారధి మరొకరు లేరు. ఆయన పాలనలో సంక్షేమ తెలంగాణ రూపుదిద్దుకున్నది. తెలంగాణలో దేశంలోఎక్కడా లేనంత సంక్షేమ పాలన సాగుతోంది. బంగారు తెలంగాణ నిర్మాణమైంది. ఒకనాడు చినుకుకు ఏడ్చిన తెలంగాణ ఇప్పుడు ఆకుపచ్చ తెలంగాణగా మారింది. ఆరోగ్య తెలంగాణ ఆవిష్కరింపబడిరది. అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ది జరిగింది. ప్రగతిలో అన్ని రాష్ట్రాలకంటే దూసుకుపోతోంది. కేసిఆర్‌ పాలనలో తెలంగాణ సుబిక్షంగా మారింది. ఒకనాడు మెతుకు కోసం తల్లడిల్లిన నేల నేడు అన్నపూర్ణగా విలసిల్లుతోంది. ముఖ్యంగా వర్ధన్నపేటను అన్ని రంగాల్లో అభివృద్ధికి ఆశీర్వదించిన కేసిఆర్‌ నాయకత్వమే తెలంగాణకురక్ష. ఆయన పాలనలోనే తెలంగాణ సుసంపన్నం అంటున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌, నేటి దాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే…
వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ వస్తున్నారు.
ఆయన రాక కోసం పెద్దఎత్తున ఏర్పాటు సాగుతున్నాయి. ప్రజలు ముఖ్యమంత్రి వస్తున్నారని తెలిసి స్వచ్చంధంగా వచ్చేందుకు సంసిద్దులౌతున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బిఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసిఆర్‌ వర్ధన్న పేట నియోజవర్గం కోసం అవసరమైన అన్ని చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో అభివృద్ది కళ్లముందు కనిపిస్తోంది. అసలు తెలంగాణలో ప్రతిపక్షాలకు చోటు లేదు. వాళ్లకు ఓట్లు అడిగే నైతికత అసలే లేదు. కాంగ్రెస్‌పార్టీ యాభై ఏళ్ల పాలనలో చేసిందేమీ లేదు. తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదు. తెలంగాణను పీల్చిపిప్పి చేశారు. సీమాంధ్ర పాలకులకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు పదవుల కోసం ఊడిగం చేశారు. తెలంగాణకు తీరని అన్యాయం చేశారు. తెలంగాణకు బతుకు లేకుండా చేశారు. తెలంగాణ జీవనం ఆగం చేశారు. అంత దుర్మార్గులు కాంగ్రెస్‌ నాయకులు. అలాంటి తెలంగాణను చూసి కన్నీరుపెట్టి, తెలంగాణ ప్రజల జీవితాలను బంగారు మయం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌. సరిగ్గా పదేళ్ల క్రితం తెలంగాణ ఏమిటి? ఇప్పుడు తెలంగాణ ఎలా వుంది? అన్నది ప్రజలు మర్చిపోకూడదు.
ఎందుకుంటే కాంగ్రెస్‌ అంటేనే పాపాలు. మోసాలు. ద్రోహాలు. వంచనలు. కాని తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలన ఒక స్వర్ణయుగం.
ఈ పదేళ్ల కాలంలో ఎన్నడూ చూడలేమనుకున్న నీళ్లు చూస్తున్నాం. తొండలు కూడా గడ్లు పెట్టవని ఎగతాళి చేసిన వారి కళ్లముందే బంగారు పంటలు చూస్తున్నాం. ఎటు చూసినా పచ్చదనం చూస్తున్నాం. పంటపొలాలు చూస్తున్నాం. ఒకనాడు కోనసీమ గురించి చెప్పుకున్న తెలంగాణ ప్రజలు ఇప్పుడు తమ కళ్లముందే పచ్చబడిన తెలంగాణ మొత్తం కోనసీమను మించిపోయింది. అంతకు మించి బంగారు పంటలు పండిస్తోంది. ప్రతి సీజన్‌లో మూడున్నర కోట్ల టన్నుల ధాన్యం తెలంగాణలో పండుతోందంటే ఎక్కడి తెలంగాణ..ఎక్కడి దాకా వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. ఇవన్నీ మన కళ్లముందు కనిపిస్తున్న నిజాలు. ఎద్దు లేక, ఎవుసం లేక, పాడి లేక, పంట లేక రైతు అగిగోసపడిన రోజులు పదేళ్ల క్రితం దాకా వున్నాయి. ఇప్పుడు రైతు కాలుమీద కాలేసుకొని కాళేశ్వరం నీళ్లతో వ్యవసాయం చేసుకుంటున్నాడు. తెలంగాణ రైతు రాజుగా మారిండు. పదేళ్ల క్రితం తెలంగాణ భూముల ధరలు నేల చూపుల్లో బేలగా వుండేవి. ఇప్పుడు ఆకాశంలో చుక్కలనుంటుతున్నాయి. తెలంగాణలో ఏ మూలలోనైనా ఓ ఐదు ఎకరాలు వున్న రైతు ఇప్పుడు కోటీశ్వరుడు. అదే ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని ఎకరాలువున్నా సాగుకు పనికి రాలేదు. భూములు వదులుకొని రైతులు బతకడానికి వలసపోయిన రోజులున్నాయి. ఇరవై, ముప్పై ఏళ్లు ఊళ్లు విడిచి వెళ్లిపోయిన వాళ్లంతా ఇప్పుడు ఇండ్లకు చేరుకున్నారు. గత తొమ్మిదేళ్లుగా సాగు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నాడు. అలాగే తెలంగాణలో ప్రభుత్వ వైద్యం అన్నది ఎంత దుర్భరంగా వుండేదో అర్ధం చేసుకోవచ్చు. వరంగల్‌లో ఎంజిఎం, హైదరాబాద్‌లో గాందీ, ఉస్మానియా, నిమ్స్‌ తప్ప చెప్పుకోవడానికి పేదల ఆసుపత్రులు వుండేవి కాదు. వీటిల్లో కూడా వైద్యం అంతంతమాత్రమే అందేది. కాని పల్లె ప్రజలకు, మిగతా జిల్లాల ప్రజలు వైద్యం కోసం అనేక అవస్ధలు పడేవారు. ఉత్తర తెలంగాణ మొత్తానికి పెద్దాసుపత్రి అంటే ఎంజిఎం మాత్రమే. కాని ఇప్పుడు పల్లె దవఖానాలు, బస్తీ దవఖాలు, వరంగల్‌లో ఎంజిఎం, కెఎంసి, ఇప్పుడు కొత్తగా నిర్మాణం జరుగుతున్న మరో గొప్ప ఆసుప్రతి త్వరలో అందుబాటులోకి రానున్నది. జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటుతో పేదలకు ఎంతో మెరుగైన ఉచిత వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఇక హైదరాబాద్‌ చుట్టూ మరో నాలుగు సూపర్‌ మల్టీ స్పెషల్‌ ఆసుపత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయి. నిమ్స్‌లో మరో కొత్త బ్లాక్‌ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. పేదలకు వైద్య భరోసా కలిగింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో గర్భిణీలకు శస్త్ర చికిత్సలేకుండా ప్రసవాలు చేయకపోవడంతో తల్లులు జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొనేవారు. రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రభుత్వాసుపత్రిలో నార్మల్‌ డెలివరీ కోసం తీసుకున్న చర్యలు దేశంలో ఏ ప్రభుత్వం తీసుకోలేదు.

తల్లి కాబోతున్న తరుణం నుంచి ప్రసవం దాకా ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తోంది. ఆ తల్లులకు పౌష్టికాహారం అందిస్తోంది. బిడ్డల క్షేమం కోసం కేసిఆర్‌ కిట్‌ అందజేస్తోంది. అందులో నగదును కూడా అందిస్తున్నాం. పేదలకు ఇంతటి గొప్ప సేవలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం. తెలంగాణ యువతకు పెద్దఎత్తును ఉపాది కల్పనలో మంత్రి కేటిఆర్‌ చొరవతో పెరిగిన ఐటి రంగం, ఫార్మా రంగాలలో కొన్ని లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. తెలంగాణ రాకముందు ఐటి ఎగుమతులు కేవలం రూ.50వేల కోట్లు. ఇప్పుడు 3.5లక్షల కోట్లు దాటుతోంది. అంటే తెలంగాణ ఐటి రంగానికే కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఇదిలా వుంటే అనేక మల్టీ నేషనల్‌ కంపనీలకు చెందిన కేంద్ర కార్యాలయాలు కూడా తెలంగాణకు వచ్చాయి. అంటే కేవలం హైదరాబాద్‌ ఎంత సురక్షితమైన ప్రాంతమని నమ్మితే జరుగుతున్నాయన్నది గుర్తుంచుకోవాలి.
పల్లెలు రూపురేఖలు మారిపోయి, పల్లె బతుకులు చితికిపోయి, పల్లె జీవనం చిద్రమైపోయి, చేతి వృత్తులు అంతరించిపోయే స్ధితికి చేరుకొని పోయిన తెలంగాణలో మళ్లీ అన్నీ చిగురించాయి. పల్లెకు వెలుగొచ్చింది.
పల్లెకు పచ్చదనమొచ్చింది. నీళ్లొచ్చాయి. చెరువు బాగైంది. చెరువు మళ్లీ ఊరికి మంచి నీటి ఊటలకు నెలవైంది. ముదిరాజ్‌లకు జీవన వరమైంది. తెలంగాణ చేపల పెంపకంలో కూడా రికార్డు సృష్టిస్తోంది. మత్య్స సంపదకు నిలయంగా మారింది. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాలలో తెలంగాణను ఒక వరంగా మార్చిన నాయకుడు కేసిఆర్‌. ఇక సంక్షేమ పధకాల విషయానికి వస్తే రైతులకు అండగా రైతు బంధు. రైతు భీమా. పెద్ద వారికి ఆసరాతో భరోసా. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడి కార్మికులకు పించన్లు ఇస్తూ వారి కుటుంబాలను ఆసరాగా నిలుస్తున్న రాష్ట్రం తెలంగాణ. కరంటు కోతలతో అష్టకష్టాలు పడ్డ తెలంగాణ ప్రజలు నిరంతరం వెలుగులు చూస్తున్నారు. ఒకప్పుడు వచ్చే కరంటు కన్నా, కోతలే ఎక్కువగా వుండేవి. ఇండ్లకైతే ఎప్పుడు వచ్చేదో, ఎప్పుడు పోయేదో కూడా తెలియనంత దుస్ధితిని తెలంగాణ చూసింది. ఇక కరంటు విషయంలో రైతు పడిన గోస ఎంత చెప్పినా తక్కువే. మరి ఇన్ని సమస్యలు తీర్చిన నాయకుడు కేసిఆర్‌ కాన్న సమర్ధవంతమైన నేత మరెవరున్నారు? తెలంగాణ తెచ్చి, తెలంగాణ బంగారు తునకగా తయారు చేసిన కేసిఆర్‌ నాయకత్వమే తెలంగాణ ప్రజలంతా కోరుకుంటున్నారు. మళ్లీ సారు సర్కారే రావాలంటున్నారు. హాట్రిక్‌ విజయాన్ని అందిస్తామని ప్రజలే దీవిస్తూ చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!