కెసిఆర్ పాలన రాష్ట్రానికి శ్రీరామరక్ష

బి ఆర్ ఎస్ పార్టీ మల్కాజిగిరి అసెంబ్లీ నియోజక వర్గ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి పార్టీకి హ్యాట్రిక్ విజయం ఖాయం. కెసిఆర్ పాలన మన రాష్ట్రానికి శ్రీరామరక్ష. నియోజకవర్గాన్ని మోడల్ మల్కాజిగిరిగా తీర్చిదిద్దుతా. ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు

మల్కాజ్గిరి, నేటిధాత్రి

నియోజకవర్గంలోని వినాయక్ నగర్ డివిజన్ పరిధిలో వాజ్పేయి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ట్రాఫిక్ సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తాను. బొల్లారం లో రైల్వే క్రాసింగ్ వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటాను. అదేవిధంగా నేరేడ్మెట్ గౌతమ్ నగర్ లలో రైల్వే క్రాసింగ్ వద్ద బ్రిడ్జిల నిర్మాణం చేపట్టి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా. అల్వాల్ లో సమగ్ర సివరేజ్ అండ్ డ్రీం వాటర్ మేనేజ్మెంట్ సిస్టం ని ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తా..278 సర్వేనెంబర్ భూ సమస్య పరిష్కరిస్తాను. బ్యాంక్ కాలనీ మరియు నేరేడ్మెట్ భూ సమస్య పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. గౌతమ్ నగర్ మరియు మిగతా డివిజన్ల లో ఉన్న అర్బన్ ల్యాండ్ యు ఎల్ సి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. నియోజక వర్గంలో నీ ప్రతీ డివిజన్ల లో మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం..అదే విధంగా వక్ఫ్ భూముల సంరక్షణ మరియు ఎండోమెంట్ భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాను. అభివృద్ధి సంక్షేమం పథకాలు ప్రజలందరికీ చేరేలా కృషి చేస్తాను. రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదు. మన ఇంటి పార్టీ. ప్రజలందరికీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి రాష్ట్రాన్ని సుభిక్షం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఅర్ గారికి దక్కుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!