కాజీపేట రైల్వే డివిజన్” పై కక్షగట్టిన “అధికారులు”?

Kazipet Railway Division

“కాజీపేట రైల్వే డివిజన్” పై కక్షగట్టిన “అధికారులు”?

నీరు గారుతున్న “కాజీపేట రైల్వే డివిజన్” ఆశలు..!

విజయవాడకు తెర వెనుక నుంచి మద్దతు ఇస్తున్న కొందరు ఆంధ్ర అధికారులు?

రైల్వేలో “ఉన్నతాధికారులను” సైతం తప్పుదోవ పట్టిస్తున్న “ఆంధ్ర అధికారులెవరు”?

ఉన్నపలంగా కాజీపేటకు 185 మంది లోకో రన్నింగ్ కార్మికుల సంఖ్యను తగ్గించిన దక్షిణ మధ్య రైల్వే

లోకో రన్నింగ్ స్టాఫ్ సంఖ్యను తగ్గించాలని కొంతమంది అధికారులు కంకణం కట్టుకుని తెరవెనుక ప్రయత్నాలు?

లోకో పైలట్ ఖాళీలు భర్తీ చేయాలని మార్చి 19న రైల్వే “జిఎం”కు వినతిపత్రం ఇచ్చిన కార్మికసంఘాలు

లోకో పైలట్ల ఖాళీలను భర్తీ చేయాలని వినతిపత్రం ఇస్తే, ఉన్న లోకో పైలట్ లను ట్రాన్స్ఫర్ చేస్తూ మార్చి 26న ఉత్తర్హులు ఇవ్వడం ఆశ్చర్యం.

కాజీపేట డివిజన్ గా ఏర్పడితే కొంతమంది అధికారులు సికింద్రాబాద్, విజయవాడ లను విడిచి కాజీపేటలో ఉండవలసి వస్తుందని, డివిజన్ కాకుండా ఉండడానికి అడ్డుకునే కుట్రలు చేస్తు.., సిబ్బందిని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్న తీరు ప్రశ్నార్థకం?

కొత్త పోస్టులు భర్తీ చేయకుండా, హుటా హుటిన ఉన్నవి కూడా తీసేయడం వెనుక మతలబు ఏంటో అధికారుల విజ్ఞతకే వదిలేద్దాం…!

తెలంగాణపై సవతి తల్లి ప్రేమ..?, ఆంధ్రకు ప్రాధాన్యత?, ఆంధ్ర అధికారుల కుట్రలు? స్పందించని తెలంగాణ కేంద్ర మంత్రులు?

నేటిధాత్రి, వరంగల్, కాజీపేట

 

కాజీపేట-హనుమకొండ-వరంగల్ త్రినగరి మాత్రమే కాకుండా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ ఆశపడుతున్నది దక్షిణ మధ్య రైల్వేలో కాజీపేట మరో డివిజన్ గా అవతరించాలని. తెలంగాణలో మరో రైల్వే డివిజన్ ఏర్పడితే ఉద్యోగాల సంఖ్య పెరిగి మరి కొంతమంది స్థానికులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని ప్రజలందరూ ఆశపడుతున్నారు. అలాగే ఇక్కడ నుండి కొన్ని కొత్త రైళ్లను ప్రారంభించడానికి అవకాశం కూడా లభిస్తుందని అందరూ అనుకున్నారు.

నూతనంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావడం అందరిలో కాజీపేట డివిజన్ ఆశలు మళ్లీ ఒక ఉన్నత స్థాయిలో చిగురించాయి. కానీ ఏ రోజుకైనా కాజీపేట ను డివిజన్ కాకుండా చేస్తామని అధికారులు పన్నాగం పన్నినట్టు ఉన్నారు. ఇందులో భాగంగానే గత కొంతకాలంగా కాజీపేటలోని రైల్వే కార్మికుల సంఖ్యను క్రమక్రమేన తగ్గిస్తూ వస్తున్నారు. ఇందులో ప్రతిసారి మొదటి వేటు లోకో పైలట్ విభాగం పైనే పడుతున్నది, బుదవారం నాడు కాజీపేటలోని లోకో పైలట్ల సంఖ్యను తగ్గిస్తూ రైల్వే ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

గతంలో కాజీపేటలోని కోచింగ్ లింకులను విజయవాడకు తరలించిన సందర్భంలో లోకో పైలట్ లందరూ ఒక్కసారిగా ఉవ్వెత్తున నిరసనను తెలియజేశారు. అప్పుడు కొద్ది రోజులు నిరాహార దీక్షలు కూడా చేపట్టారు. దీనికి కాజీపేటలోని స్థానిక సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ మద్దతు తెలపడంతో ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన సందర్భంలో అధికారులు కార్మిక సంఘ నాయకులతో చర్చలు జరిపి కోల్పోయిన కోచింగ్ లింకులను తిరిగి ఇవ్వకపోయినప్పటికీ, వాడి బీదర్ సెక్షన్లో నడిచే కొన్ని ట్రైన్లను కాజీపేటకు కేటాయించి కంటి తడుపు చర్యలు చేపట్టారు. కానీ కొంతకాలానికి వాటిని కూడా తిరిగి వేరే డిపోలకు కేటాయించడంతో కాజీపేట క్రూ డిపో ఎంతో నష్టపోయింది ఒక రకంగా చెప్పాలంటే కాజీపేట క్రూ డిపోను నిర్వీర్యం చేయడానికి బీజం ఇక్కడే పడిందని చెప్పవచ్చు.

గత ఐదు సంవత్సరాల కాలంగా కాజీపేట క్రూ డిపోలో పనిచేస్తున్న లోకో పైలట్ల సంఖ్యను అధికార గణం క్రమక్రమంగా తగ్గిస్తూ వస్తున్నది. ఈ విషయం కార్మిక సంఘాలు గుర్తించకుండా కొద్దికొద్దిగా తగ్గిస్తూ వచ్చింది. గత ఐదు సంవత్సరాల నుండి ట్రాన్స్ఫర్ ల రూపంలో కానీ, నూతన పోస్టింగుల రూపంలో కానీ కాజీపేటకు 10 మందికి మించి కేటాయించలేదు, కానీ ఇక్కడి నుండి చాలామంది ప్రమోషన్ల రూపంలో వేరువేరు క్రూ డిపోలకు వెళ్ళినారు. 2020 వ సంవత్సరంలో 623 మందితో నడిచిన క్రూడిపో నవంబర్ 2023 నాటికి 501 గాను, మార్చి 2025 కు 470 కి పడిపోయింది. ఈ విధంగా రోజురోజుకు కృూ సంఖ్యను తగ్గిస్తూ అధికారులు కాజీపేట పై ఉన్న నిరాసక్తను తెలియజేస్తున్నారు. కాజీపేట క్రూడిపోకు మే 2020 సంవత్సరంలో కేటాయించిన పోస్టుల సంఖ్య 790 కాగా బుధవారం నాడు అధికారులు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఈ సంఖ్య 542 కు పడిపోయింది. అంటే గత ఐదు సంవత్సరాల కాలంలో 248 పోస్టులు ఇక్కడి నుండి తొలగించబడ్డాయి.

Kazipet Railway Division
Kazipet Railway Division

గూడ్స్ లోకో పైలట్ల నుండి సీనియార్టీ ప్రకారం పదోన్నతి కల్పిస్తూ ప్యాసింజర్ లోకో పైలట్ మరియు మెయిల్ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ ఖాళీలను భర్తీ చేస్తారు, ఈ విధంగా పదోన్నతుల కల్పనలో కూడా కాజీపేట లో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా, విజయవాడ డివిజన్లో ఉన్న సికింద్రాబాద్ కు చెందిన క్రూ డిపోలో భర్తీ చేశారు. ఈ విధంగా చేయడం వలన ఆయా సంబంధిత ఖాళీలలో కాజీపేట కు చెందిన గూడ్స్ లోకో పైలట్లు సుమారు 30 మంది పనిచేస్తున్నారు. కొంతమంది పదవీ విరమణ పొందడం, కోవిడ్ కష్టకాలంలో మరణించడం, కొంతమంది లోకో ఇన్స్పెక్టర్గా, ప్యాసింజర్ లోకో పైలట్లుగా పదోన్నతి పొందడం మరియు మరి కొంతమంది మెడికల్ అన్ఫిట్ అవడం వలన కాజీపేటలోని గూడ్స్ లోకో పైలట్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీనికి తోడు అధికారులు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లను పరిగణలోకి తీసుకోకపోవడంతో కాజీపేట డిపో యొక్క క్రూ సంఖ్య రోజురోజుకు పడిపోతూ వస్తున్నది.

Kazipet Railway Division
Kazipet Railway Division

అయితే విశాఖపట్నం కేంద్రంగా నూతన రైల్వే జోన్ ఏర్పాటు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంలో విజయవాడ డివిజన్ అనేది విశాఖపట్నం జోన్ లోకి వెళ్తున్నదని రైల్వే అధికారులు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇలాంటి సందర్భంలో కాజీపేటలోని లోకో పైలట్ల సంఖ్యను తగ్గించి వారిని విజయవాడ డివిజన్లో సికింద్రాబాద్కు చెందిన లోకో పైలట్లుగా పనిచేస్తున్న డిపోలో కలపడం ఒక హాస్యాస్పదంగా మారింది. ఈ విధంగా కలపడం వలన భవిష్యత్తులో సికింద్రాబాద్ డివిజన్లోని లోకో పైలట్ల ఉద్యోగాల సంఖ్య తగ్గిపోనున్నది.

సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ వెనుకబాటుతనానికి ఆంధ్ర నాయకులు వారి వారి స్థాయిలలో కృషిచేసి రైల్వేల పరంగాను ఎదగకుండా చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఆంధ్ర ప్రాంతం కు చెందిన కొంతమంది అధికారులు సికింద్రాబాద్ డివిజన్లో పనిచేస్తూ ఇంకా ఆంధ్రకే మద్దతునిస్తున్నారు. ఇందులో భాగంగానే కాజీపేట డివిజన్ ఏర్పాటును అడ్డుకుంటున్నట్టుగా తెలియవస్తున్నది. కాజీపేట డివిజన్ ఏర్పాటులో కీలక భూమిక పోషించనున్న లోకో రన్నింగ్ స్టాఫ్ సంఖ్యను తగ్గించాలని కొంతమంది అధికారులు కంకణం కట్టుకుని తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. కాజీపేట డివిజన్ గా ఏర్పడితే కొంతమంది అధికారులు సికింద్రాబాద్, విజయవాడలను విడిచి కాజీపేటలో ఉండవలసి వస్తుందని, డివిజన్ కాకుండా ఉండడానికి చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

Kazipet Railway Division
Kazipet Railway Division

తెలంగాణలోని రెండవ అతిపెద్ద నగరమైన వరంగల్-హనుమకొండ-కాజీపేట కు కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్టును కేటాయించడం, ఇదే సందర్భంలో రైల్వే ఫ్యాక్టరీ కాస్త మల్టిపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా మారడంతో ఇక్కడి ప్రజలలో రైల్వే డివిజన్ ఏర్పాటుపై ఆశలు ఎగిరిపడ్డాయి. కానీ అధికారులు ఈ విధమైన చర్యలతో డివిజన్ గా మారే ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఇక్కడి రైల్వే కార్మికులు, కార్మిక నాయకులు, ప్రజలు అందరూ అధికారుల చర్యలను విమర్శిస్తూ కాజీపేట డివిజన్ గా ప్రకటించాలని కోరుతున్నారు.

 

ఈనెల 8వ తేదీన కాజీపేటలో కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు కోరుతూ, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు రైల్వే మంత్రిని కలిసి వినతి..

కాంగ్రెస్ మంత్రులు, ఎంపీల ప్రతినిధి బృందం ఈ నెల మార్చి 8న కేంద్ర రైల్వే మంత్రిని కలిసి, కాజీపేటలో కొత్త రైల్వే డివిజన్‌ను సృష్టించాలని మరియు తెలంగాణ రాష్ట్రానికి కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, డి. సీతక్క, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, పోరిక బలరాం నాయక్‌ లతో కూడిన ప్రతినిధి బృందం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్ర అవసరాలను జాబితా చేసే మెమోరాండంను సమర్పించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని వాగ్దానం ప్రకారం కాజీపేటలో రైల్వే తయారీ యూనిట్ ఏర్పాటుకు కొనసాగుతున్న పనులకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతినిధి బృందం అదే స్థలంలో రైల్వే డివిజన్‌ను కోరింది.

Kazipet Railway Division
Kazipet Railway Division

 

కాజీపేట రైల్వే డివిజన్…!

విశాఖపట్నంలో ప్రధాన కార్యాలయంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు ఫలితంగా, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్‌లో సికింద్రాబాద్, హైదరాబాద్ మరియు నాందేడ్ అనే మూడు డివిజన్లు మాత్రమే మిగిలిపోయాయని, గుంతకల్, విజయవాడ మరియు గుంటూరులను సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌లో విలీనం చేశారని వారు వాదించారు.
రైల్వే నెట్‌వర్క్ నిర్వహణ కోసం ప్రయాణీకులకు, వస్తువులకు మెరుగైన భద్రతను అందించడానికి కొత్త విభాగాన్ని సృష్టించడం అవసరమని మంత్రులు అన్నారు. ట్రాఫిక్‌తో పాటు ఎక్కువ సరుకు రవాణా ఉన్న కాజీపేట ప్రాంతాన్ని డివిజన్‌గా చేస్తే గుంటూరు మరియు హైదరాబాద్ డివిజన్‌ల కంటే ఎక్కువ ట్రాక్ కిలోమీటర్లు మరియు ఆదాయం ఉంటుందని వారు చెప్పారు.

 

తెలంగాణపై సవతి తల్లి ప్రేమ, ఆంధ్రకు ప్రాధాన్యత?, స్పందించని కేంద్ర మంత్రులు?

ఈ నెల మార్చి 19 బుధవారం నాడు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, కాజీపేట క్రూ డిపో ని సందర్శించిన సందర్భంగా, లోకో పైలట్ల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ రిప్రెసెంటేషను ఇచ్చిన కార్మిక సంఘం నాయకులు.
జనరల్ మేనేజర్ సందర్శన జరిగిన వారం రోజులకే కాజీపేట లోకో పైలట్ ల సంఖ్యను తగ్గిస్తూ ఉత్తర్వులు వెలవడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!