స్వాములకు అన్న ప్రసాదం అందజేసిన కవిత కిషన్ దంపతులు
పరకాల నేటిధాత్రి :
మండలంలోని మల్లక్కపేట గ్రామంలోని ఈ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో బొజ్జం కవిత కిషన్ దంపతులు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి మాల ధరించిన దాదాపు 250 మంది స్వాములకు అన్నప్రసాదం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,ఆలయ చైర్మన్ అంబిరు మహేందర్,ఇఓ వెంకటయ్య,అర్చకులు కాటూరి జగన్నాధాచార్యులు,డైరెక్టర్స్ దొమ్మటి శంకరయ్య,నిట్టె బాలరాజు,బొజ్జం రాజేందర్ అలాగే,నల్ల విష్ణువర్థన్ రెడ్డి,భక్తులు పాల్గొన్నారు.