పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జిగా కసిరెడ్డి భాస్కరరెడ్డి…

శేరిలింగంపల్లి నేటి ధాత్రి,:-

వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, పాలకుర్తి శాసనసభ ఇంచార్జిగా బిజెపి శేరిలింగంపల్లి నాయకుడు కసిరెడ్డి భాస్కరరెడ్డిని రాష్ట్ర పార్టీ నియమించింది. ఈనెల 27న ఈ ఎన్నిక జరుగనుంది. గతంలో వరంగల్ ఉప ఎన్నిక, మహబూబ్ నగర్ ఉప ఎన్నిక, రాజరాజేశ్వరీనగర్-బెంగలూరు, నారాయణపేట, వికారాబాద్ ఎన్నికల్లో కూడా పని చేసిన కసిరెడ్డి భాస్కరరెడ్డిని తిరిగి ఎం.ఎల్.సీ. ఎన్నికలో ఇంచార్జిగా నియమించడాన్ని బిజెపి శ్రేణులు స్వాగతించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *