ఎడ్యుకేషనల్ హబ్ గా కరీంనగర్..

Educational Educational

ఎడ్యుకేషనల్ హబ్ గా కరీంనగర్..

 

ఇంజినీరింగ్, లా కాలేజ్ మంజూరుతో విద్యారంగం మరింత అభివృద్ధి..

 

విద్యా రంగంలో సీఎం రేవంత్ రెడ్డి విప్లవాత్మక కార్యక్రమాలు..

 

దేశంలోనే అత్యుత్తమ

గుర్తింపు తెస్తున్న ముఖ్యమంత్రి

 

శాతవాహన యూనివర్సిటీకి లా కాలేజీ, హుస్నాబాద్ లో ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఇందుకు కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు

 

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు

 

కరీంనగర్, నేటిధాత్రి:

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగంలో చేపడుతున్న విప్లవాత్మక మార్పులతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా రాబోయే కాలంలో ఎడ్యుకేషనల్ హబ్ గా మారబోతున్నదని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.

కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీకి లా కాలేజీ, హుస్నాబాద్ లో ఇంజినీరింగ్ కాలేజ్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇందుకోసం ప్రత్యేకంగా కృషి చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మంగళవారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ కి లా కాలేజ్, హుస్నాబాద్ కు ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.

పెద్దపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళాశాలలు ప్రకటించారని, మూడు నెలల లోపే వాటిని మంజూరు చేస్తూ హామీని నిలబెట్టుకోవడం చారిత్రాత్మకమన్నారు.

గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కరీంనగర్ జిల్లాలో విద్యారంగం కుంటుపడిందని తెలిపారు.

అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం కరీంనగర్ కు మెడికల్ కాలేజ్ మంజూరు చేయలేదని మండిపడ్డారు. మెడికల్ కాలేజ్ ఏర్పాటు కోసం గతంలో ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ కు మెడికల్ కళాశాల మంజూరు చేశారని పేర్కొన్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటులో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలకపాత్ర పోషించారని తెలిపారు.

బిఆర్ఎస్ పాలకులు గత పదేళ్ల కాలంలో విద్యారంగాన్ని బ్రష్టు పట్టించారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగ అభివృద్ధికి అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేపడుతున్నారని రాజేందర్ రావు తెలిపారు.

ప్రతి ఏటా ప్రభుత్వం బడ్జెట్లో విద్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నదని చెప్పారు.

ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ ప్రభుత్వం విద్య శాఖకు ఈ 23,108 కోట్ల రూపాయలు కేటాయిం చిందని రాజేందర్ రావు పేర్కొన్నారు. డా.బి.ఆర్. అంబేద్కర్ దూరదృష్టితో అర్ధ శతాబ్దానికి పూర్వం చెప్పిన ఈ మాటలు నేటికీ మన సమాజానికి వర్తిస్తాయనీ, అందులో భాగంగానే యువతకు శాస్త్ర- సాంకేతిక నైపుణ్యతను పెంపొందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని హైదరాబాదులో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు.

డా.బి.ఆర్.అంబేద్కర్ కలలు కన్న విద్యావ్యవస్థను తయారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు.

దీనికోసమే రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి 11, 600
కోట్ల రూపాయలు మంజూరు చేసిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం ఒక చారిత్రాత్మకమని పేర్కొన్నారు.

ప్రతి నియోజక వర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నదని తెలిపారు.

శాతవాహన యూనివర్సిటీ పరిధిలో హుస్నాబాద్లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బీటెక్ సీఎస్ఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, ఈసీఈ బ్రాంచులను ఏర్పాటు చేయనున్నారని తెలిపారు.

ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణానికి రూ.44.12 కోట్లు కేటాయించగా అందులో రూ.29.12 కోట్లు ప్రస్తుతం ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు.

శాతావాహన వర్సిటీలో ఏర్పాటు చేయనున్న లా కాలేజీలో మూడేళ్ల కోర్సు, రెండేళ్ల కోర్సు(మేధో సంపత్తి చట్టం)లో అడ్మిషన్లను ఇవ్వనున్నారని తెలిపారు. ఈకాలేజీ నిర్మాణానికి మొత్తం రూ.22.96 కోట్లు కేటాయించగా..

అందులో ప్రస్తుతం ఐదు కోట్లు మంజూరు చేశారనీ, మొత్తంగా రూ.67.08 కోట్లను ప్రభుత్వం ఈ రెండు కాలేజీలకు కేటాయించనుందని రాజేందర్రావు పేర్కొన్నారు.

లా కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇందుకోసం ప్రత్యేకంగా కృషి చేసిన రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వెలిచాల రాజేందర్ రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!