వాలీబాల్ క్రీడలను ప్రారంభించిన కరకగూడెం ఎస్ఐ రాజేందర్

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…

కరకగూడెం మండలంలోని గొల్లగూడెం హజరత్ ఆలీబాబా జయంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం,ములుగు రెండు జిల్లాల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను కరకగూడెం ఎస్ఐ రాజేందర్ చేతుల మీదుగా ప్రారంభించి,క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్ఐ రాజేందర్ మాట్లాడుతూ….క్రీడల‌ వలన శారీరిక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కల్గించి,క్రీడాకారుల మధ్య స్నేహ సంబంధాన్ని పెంపొందిస్తుందని అన్నారు.క్రీడాకారులతో పాటు చదువులలో ముందుండాలని తెలిపారు.క్రీడాకారులు,యువత ఏటువంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టోర్నీ నిర్వాహకులు షారుఖ్,శ్రీను, మోయిన్,గ్రామస్థులు సత్యం,నగేష్,గ్రామ యువత,క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!