సినిమా వీక్షించిన తెలంగాణ మంత్రులు.

Kannappa Kannappa

క‌న్న‌ప్ప అద్భుతం.. సినిమా వీక్షించిన తెలంగాణ మంత్రులు

 

 

 

 

 

ఆదివారం ముగ్గురు తెలంగాణ మంత్రులు గ‌చ్చిబౌలి ఏఎంబీ మ‌ల్టీప్లెక్స్ లో మోహ‌న్ బాబు, విష్ణుల‌తో క‌లిసి క‌న్న‌ప్ప‌ సినిమా వీక్షించారు.

మంచు విష్ణు (Manchu Vishnu) క‌న్న‌ప్ప (Kannappa) చిత్రం ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతున్న విష‌యం తెలిసిందే.

ఇప్ప‌టికే సినిమా చూసిన చాలా మంది మిశ్ర‌మ‌ రివ్యూస్ ఇచ్చినా, ఇస్తున్నా క‌లెక్ష‌న్ల ప‌రంగా మాత్రం స్టేబుల్‌గానే ఉంది.

అయితే సినిమా ఫ‌స్టాఫ్ కాస్త బ‌ల‌హీనంగా ఉన్న‌ప్ప‌టికీ సెకండాఫ్ మ‌రో లెవ‌ల్‌లో ఉండి ప్రేక్ష‌క‌కుల‌ను భ‌క్తి ప్ర‌పంచంలో తేల్చిందంటూ అనేక మంది త‌మ త‌మ సోష‌ల్‌ మీడియాల ద్వారా అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తుండ‌డంతో ఫ్యామిలీలు థియేట‌ర్ల బాట ప‌డుతున్నాయి.

సినిమా విజ‌యంపై.. ఇప్ప‌టికే మంచు విష్ణు స‌క్సెస్ మీట్ సైతం నిర్వ‌హించి త‌మ సంతోషాన్ని పంచుకున్నారు. అయితే తాజాగా ఆదివారం తెలంగాణ‌ ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka), సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి (Komatireddy Venkat Reddy), మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ముగ్గురు గ‌చ్చిబౌలి ఏఎంబీ మ‌ల్టీప్లెక్స్ (AMB Cinemas) లో మోహ‌న్ బాబు, విష్ణుల‌తో క‌లిసి క‌న్న‌ప్ప‌ సినిమా వీక్షించారు.

అనంత‌రం మంత్రి భ‌ట్టి మాట్లాడుతూ మోహ‌న్ బాబు, విష్ణుల‌కు అభినంద‌న‌లు తెలిపారు.
సినిమా ఊహ‌లకంద‌ని విధంగా ఉంద‌ని విష్ణు న‌ట‌న‌, ముఖ్యంగా క్లైమాక్స్ అద్భుతంగా ఉంద‌ని అన్నారు. 

ఆపై మ‌త్రి కోమ‌టిరెడ్డి మాట్లాడుతూ..

తెలుగు చిత్ర సీమ‌లో చాలా రోజుల త‌ర్వాత ఇలాంటి మంచి సినిమా వ‌చ్చింద‌ని అన్నారు.

మోహ‌న్ లాల్‌, అక్ష‌య్ కుమా,ప్ర‌భాస్‌ వంటి పెద్ద‌ న‌టుల‌ను తీసుకువ‌చ్చి మోహ‌న్ బాబు, విష్ణులు మంచి చిత్రం అందించార‌ని, ఈ సినిమా కేవ‌లం శివ భ‌క్తులే కాదు అంద‌రూ ప‌ర‌వ‌శించి పోయేలా చిత్రం ఉంద‌ని అన్నారు..

మున్మందు టాలీవుడ్ ద‌ర్శ‌కులు కూడా ఇలాంటి సినిమాలు తీయాల‌ని, త‌ద్వారా మ‌న సంస్కృతి, పురాణాల గురించి నేటి త‌రానికి తెలిసే అవ‌కాశం ఉంటుంద‌ని తెలుపుతూ చివ‌ర‌కు క‌న్న‌ప్ప టీంకు అభినంద‌న‌లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!