గద్దెకు చేరిన కంక వనం

ప్రారంభమైన సమ్మక్క సారలమ్మ జాతర

మందమర్రి, నేటిధాత్రి:-

ఏరియాలోని ఆర్కే 1ఏ గని పై సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గిరిజన జాతరలో ముఖ్యమైన కంక వనాన్ని గిరిజన పూజారులు, సింగరేణి అధికారులు, యూనియన్ నాయకులు అమ్మవార్ల గద్దెలకు చేర్చారు. ఈ మహోత్సవానికి ముఖ్యఅతిథులుగా ఏరియా జిఎం మనోహర్, ఎస్ఓటు జిఎం రాజేశ్వర్ రెడ్డి లు హాజరై, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా జిఎం మనోహర్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 21 నుండి 24 వరకు ఆర్కే 1ఏ గనిపై నిర్వహించూ సమ్మక్క సారలమ్మ జాతరకు పట్టణ, చుట్టుపక్క గ్రామాల ప్రజలు, ఉద్యోగులు అందరు విచ్చేసి, అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమ్మక్క, సారలమ్మ పూజారి దూలం కనకయ్య గౌడ్, ఏఐటీయూసి బ్రాంచ్ కార్యదర్శి ఆంజనేయులు, ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఆర్కేపి ఓసిపి ప్రాజెక్ట్ అధికారి గోవిందారావు, ఆర్కే 1ఏ గని మేనేజర్ జయంత్, యూనియన్ నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!