ప్రారంభమైన సమ్మక్క సారలమ్మ జాతర
మందమర్రి, నేటిధాత్రి:-
ఏరియాలోని ఆర్కే 1ఏ గని పై సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గిరిజన జాతరలో ముఖ్యమైన కంక వనాన్ని గిరిజన పూజారులు, సింగరేణి అధికారులు, యూనియన్ నాయకులు అమ్మవార్ల గద్దెలకు చేర్చారు. ఈ మహోత్సవానికి ముఖ్యఅతిథులుగా ఏరియా జిఎం మనోహర్, ఎస్ఓటు జిఎం రాజేశ్వర్ రెడ్డి లు హాజరై, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా జిఎం మనోహర్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 21 నుండి 24 వరకు ఆర్కే 1ఏ గనిపై నిర్వహించూ సమ్మక్క సారలమ్మ జాతరకు పట్టణ, చుట్టుపక్క గ్రామాల ప్రజలు, ఉద్యోగులు అందరు విచ్చేసి, అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమ్మక్క, సారలమ్మ పూజారి దూలం కనకయ్య గౌడ్, ఏఐటీయూసి బ్రాంచ్ కార్యదర్శి ఆంజనేయులు, ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఆర్కేపి ఓసిపి ప్రాజెక్ట్ అధికారి గోవిందారావు, ఆర్కే 1ఏ గని మేనేజర్ జయంత్, యూనియన్ నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.