
రామకృష్ణాపూర్, మార్చి 04, నేటిధాత్రి:
మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సుభాష్ నగర్ ఏరియాలో గల మైన్స్ రెస్క్యూ స్టేషన్ ఆవరణలోని శ్రీ కనక దుర్గాదేవి ఆలయ ప్రథమ వార్షికోత్సవం గత రెండు రోజులుగా పూజలు నిర్వహిస్తు ఘనంగా నిర్వహించారు. రెండో రోజు సోమవారం రోజున పూర్ణాహుతి, కుంభహోమం, చండీ యాగం మరియు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమం మందమర్రి ఏరియా జెనరల్ మేనేజర్ మనోహర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈకార్యక్రమంలో బెల్లంపల్లి రీజియన్ రక్షణ జెనరల్ మేనేజర్ కే హెచ్ ఎన్ గుప్తా దంపతులు, మందమర్రి ఎస్ ఓ టు జి ఎం రాజేశ్వర రెడ్డి దంపతులు, రెస్క్యూ స్టేషన్ ఇన్చార్జి రామ్మోహన్ దంపతులు,కార్మిక కుటుబసభ్యులు, యూనియన్ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.