కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షనారసింహ సాలగ్రామమూర్తి….

భక్తుల రాకతో జనసంద్రమైన సాలగ్రామ ఆశ్రమం…..

భద్రాచలం నేటిదాత్రి

కల్పవృక్ష నారసింహస్వామి లీలలు అమోఘం….

భద్రాచలం: భద్రాద్రి దివ్య క్షేత్రంలో ఎన్నో లీలలు చూపుతున్న సాక్షాత్తు లక్ష్మీనృసింహుడు ప్రసాధించిన కల్ప వృక్ష నారసింహసాల గ్రామ మూర్తిని ప్రతి నిత్యం వందల సంఖ్యలో భక్తులు దర్శించి ముడుపులు చెల్లించి మొక్కులు తీర్చుకుంటున్నారు.ఇక్కడ ముడుపు కడితే ఎటువంటి కోరికైనా నెరవేరుతుందని భక్తుల విశ్వాసం.మేడారం జాతరకి వెళ్లే భక్తులు సైతం ముందుగా కల్ప వృక్ష నరసింహ సాలగ్రామ మూర్తిని దర్శించి ముడుపులు చెల్లించి మేడారం ప్రయాణమవుతున్నారని అంతేకాకుండా ఇక్కడ స్వామివారికి ముడుపు కట్టిన అనతి కాలంలోనే ఎంతోమంది జీవితాలలో మార్పులు వచ్చాయని, ఇక్కడ కొలువై ఉన్న నృసింహస్వామి భక్తుల పాలిట కొంగుబంగారంగా మహిమలు చూపుతున్నారని అందుకే వివిధ ప్రాంతాల నుండి భక్తులు ప్రతి నిత్యం స్వామివారిని దర్శనం చేసుకుంటూ ముడుపులు చెల్లిస్తున్నారని ఆశ్రమ నిర్వాహకులు డా. కృష్ణ చైతన్య స్వామి అన్నారు. దర్శనం కొరకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్న ప్రసాదాన్ని శ్రీనృసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో అందిస్తున్నామని ప్రతినిత్యం భద్రాద్రి దివ్య క్షేత్రానికి వస్తున్న భక్తులు రామ దర్శనంతో పాటుగా కల్పవృక్షనారసింహ స్వామిని దర్శించి తరిస్తున్నారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!