కుల వివక్ష నిర్మూలన కోసం జ్యోతిరావు పూలే పోరాటం.

Congress Congress

కుల వివక్ష నిర్మూలన కోసం జ్యోతిరావు పూలే పోరాటం….

కాంగ్రెస్ నాయకులు పలిగిరి కనకరాజు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

కుల వివక్ష నిర్మూలన కోసం మహాత్మా జ్యోతిరావు పూలే అలుపెరుగని పోరాటం చేశారని కాంగ్రెస్ నాయకులు పలిగిరి కనకరాజు అన్నారు.శుక్రవారంక్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టీపిసిసి నాయకులు రఘునాథ్ రెడ్డి,సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, వొడ్నాల శ్రీనివాస్, అబ్దుల్ అజీజ్ లు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పూలే సేవలను కొనియాడారు.

Congress
Congress

బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేశారని నాయకులు అన్నారు. ఆ మహానీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. అంటరానితనం, కుల వివక్ష నిర్మూలన కోసం పూలే అలుపెరుగని పోరాటం చేశారని అన్నారు. స్త్రీ విద్య కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని ఉద్ఘాటించారు. సమసమాజ నిర్మాణంలో జ్యోతిరావు పూలే కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అభివర్ణించారు.పూలే ఆశయ సాధనకు కృషి చేయడమే మనం అర్పించే ఘన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ జంగం కళ, బత్తుల వేణు, కుర్మ సురేందర్, ఎల్పుల సత్యం, గోపు రాజం, శివ కిరణ్, మహిళా నాయకురాల్లు సునీత, సృజన, రాజేశ్వరి, శారద, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!