Jyotirao Phule’s Services Are Everlasting
జ్యోతిరావు ఫూలే సేవలు చిరస్మరణీయం
ఆమూదాలపల్లి మల్లేశం గౌడ్
పరకాల,నేటిధాత్రి
జ్యోతిరావు పూలే సమాజంలో సమానత్వం,విద్యా విస్తరణ కోసం బాపులే చేసిన కృషి చిరస్మరణీయమని ఆయన ఆముదాలపల్లి మల్లేశం గౌడ్ తెలిపారు.అణగారిన వర్గాలకు విద్య అందించాలనే లక్ష్యంతో ఆయన ప్రారంభించిన ఉద్యమం దేశ సామాజిక వ్యవస్థలో మార్పుకు దోహదపడిందని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాలనే బాపులే ఆశయం నేటికీ మార్గదర్శకంగా నిలుస్తోందని వెల్లడించారు.మహిళా విద్యకు ప్రాధాన్యతనిస్తూ సావిత్రిబాయ్ ఫూలేతో కలిసి చేసిన సేవలు భారత సమాజానికి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు.ప్రస్తుత తరానికి బాపులే ఆలోచనలు స్ఫూర్తిగా నిలవాలని,వాటిని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని మల్లేశం గౌడ్ సూచించారు.
