జీవో29 రద్దు చేసి గ్రూప్1 ఉద్యోగాలు నియమించాలి

ఓపెన్ కేటగిరి అంటే ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరి హక్క – భూక్య తిరుపతి నాయక్

కరీంనగర్, నేటిధాత్రి:

జీవో29 రద్దుచేసి ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలని లంబాడ జేఏసీ పక్షాన రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నదని, జీవో నెంబర్29 ఇది భారత రాజ్యాగానికి వ్యతిరేక జీవో, ఈజీవో వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఉద్యోగ నియామకాల్లో తీరని అన్యాయం జరుగుతున్నదని, ఈవర్గాలకు ఓపెన్ క్యాటగిరిలో రానీయకుండా జరుగుతున్న పెద్ద కుట్ర అని, ఓపెన్ క్యాటగిరి అంటే ఇది కేవలం ఓసిలదే కాదు ఓపెన్ క్యాటగిరి అంటే ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరి హక్కు ఆర్టికల్16 ప్రకారం ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన వర్గాలకు ముందుకు తీసుకురావడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కు ఉద్యోగం. కాని ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ తీసుకువచ్చి బడుగు బలహీన వర్గాల ప్రజలను ఉద్యోగాలలో తీరని అన్యాయం చేస్తున్నదని, దీనితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలను రిజర్వేషన్ వరకు మాత్రమే పరిమితం చేసి ఎంత ప్రతిభ ఉన్న ఓపెన్ కేటగిరి పోస్టుల్లో రానీయకుండా చేసే కుట్రనే జీవో నెంబర్29 తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీల పైన పెద్ద కుట్ర జరుగుతున్నదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓపెన్ కేటగిరీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలను ఉద్యోగ నియామకాల్లో ప్రతిభ ఉన్న రానీయకుండా చేసి కేవలం రిజర్వేషన్లకే పరిమితం చేసే కుట్ర కనబడుతున్నదని, నూటికి పదిశాతం కూడా లేని ఓసిలకు ఈబిసి రిజర్వేషన్లు పది శాతం కేటాయించారని, మేము దీనికి వ్యతిరేకం కాదు కానీ ఓపెన్ కేటగిరీలో ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికి రావలసిన ఉద్యోగాలను వారికి రాకుండా కావాలనే రిజర్వేషన్ కు పరిమితం చేస్తున్నారని, కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్29 రద్దు చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నదని, కాంగ్రెస్ పార్టీ రెండు నాలుకల ధోరణితో పైన రాహుల్ గాంధీ చెప్పే విధానం వేరు క్రింద రేవంత్ రెడ్డి పాటించే విధానం వేరు, రాహుల్ గాంధీ అన్ని వర్గాలను ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరూ ఓపెన్ కేటగిరిలో నియమించాలని చెప్తే క్రింద ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం ఓసి అంటే కేవలం అగ్రకులాలకు సంబంధించిన పోస్టులు మాత్రమే అని అర్థం వచ్చే విధంగా ప్రవర్తిస్తూ ఓపెన్ కేటగిరి అంటే కేవలం అగ్రకులాల వారు మాత్రమేనని యాబై శాతం ఉద్యోగాలను వారి బంధువులకు కట్టబెట్టే కుట్ర జరుగుతున్నదని, వంద పోస్టులు ఉంటే ప్రతిభ ఉన్న యాబై శాతం మందిని ఓపెన్ పోస్టులో తీసుకున్న తర్వాత పదహారు శాతం, ఎస్సీలు పదిశాతం, ఎస్టీలు ఇరవై ఏడు శాతం బీసీలు మిగిలిన పోస్టులలో ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికి హక్కు గ్రూప్1 పోస్టులలో జీవో29 ఈవిధానాన్ని రద్దు చేసి మెయిన్స్ లో అర్హత సాధించిన వారికి ఓపెన్ క్యాటగిరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చే విధంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, జీవో29 ద్వారా తీరని అన్యాయం జరుగుతుందని అందుకోసమే జీవో నెంబర్29 రద్దు చేసి ఇంతకుముందు ఏవిధానం పాటించారో ఆవిధానంతోనే ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలని, లంబాడి జేఏసీ చైర్మన్, కొత్తపల్లి మండల మాజీ వైస్ ఎంపీపీ భూక్య తిరుపతి నాయక్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!