ఆల్ ఇండియా స్టూడెంట్స్
అసోసియేషన్ జిల్లా సెక్రటరీ శీలపాక నరేష్
భూపాలపల్లి నేటిధాత్రి
జంగేడు గ్రామంలో ఉన్నటువంటి పంట పొలాన్ని సందర్శించిన
ఆల్ ఇండియా స్టూడెంట్స్
అసోసియేషన్ జిల్లా సెక్రటరీ శీలపాక నరేష్ అనంతరం బాధితులతో మాట్లాడుతూ జంగేడు గ్రామానికి చెందిన ఒంటేరు సమ్మయ్య అదే ప్రాంతంలో 32 గుంటల పంట పొలం ఉన్నది ఈ పంట పొలానికి సంబంధించి వాళ్ళు పట్టా పాసబుక్ దారులు తాతల కాలం నుంచి వాళ్ళు ఈ పొలాన్ని సాగు చేసుకుంటూ వస్తున్నారు యొక్క పొలాన్ని కొంతమంది అనగా కోడి సతీష్ కోడి మల్లయ్య కోడి అశోక్ రేణుకుంట్ల చంద్రయ్య అనే ఈ ముగ్గురు మా పంట పొలం మీద. 10/10/24 రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో గడ్డి మందుతో పంట పొలం పై పిచికారి చేయడం జరిగింది ఇలా గడ్డి మందు పంటపొలంపై కొట్టడం వలన ఆ పంట పొలం అంతా పూర్తిగా నాశనమైపోయింది దానివల్ల వారు ఎంతో నష్టపోయారు వాళ్లకు ఉన్నటువంటి ఏకైక దిక్కు ఈ పంట పొలం మాత్రమే దీని వల్ల వాళ్ళు ఎంతగానో ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా జరగడం వల్ల వాళ్ళు ఆత్మహత్యాయత్నానికి కూడా ప్రయత్నించడం జరిగింది. కావున అధికారులు వెంటనే స్పందించి పైన పేర్కొన్న వ్యక్తులు అందరి పై చట్టపరమైన చర్యలు తీసుకొని మా పంట పొలానికి మాకు
రక్షణ కల్పించగలరు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అల్లూరి చందు,పింగిలి రమేష్ పాల్గొన్నారు