జయముఖి కలశాల విద్యార్థి అనినాష్ కుటుంబానికి న్యాయం చేయాలి

విద్యార్థి మృతికి కారణం హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యమే

ఏబీవీపీ వరంగల్ జిల్లా కన్వీనర్ గజ్జల దేవేందర్

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేటలోని జయముఖీ కళాశాల విద్యార్థి అనినాష్ కుటుంబానికి న్యాయం చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వరంగల్ జిల్లా కన్వీనర్ గజ్జల దేవేందర్ హాస్టల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
నర్సంపేట పట్టణంలోని జయముకి కళాశాల ముందున్న ప్రైవేట్ హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం వల్ల విద్యుత్ ఘాతానికి గురై జయముఖి కళాశాలకు చెందిన ఫార్మ్ డి చదువుతున్న నిర్మల్ జిల్లాకు చెందిన మొదటి సంవత్సరం విద్యార్థి కొండేల్వాడి అవినాష్ రెడ్డి మృతి చెందడంతో విద్యార్థి కుటుంబానికి న్యాయం చేస్తూ హాస్టల్ నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నర్సంపేట మార్చురీ ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ వరంగల్ జిల్లా కన్వీనర్ గజ్జల దేవేందర్ మాట్లడుతూ
ఎలాంటి అనుమతులు లేకుండా హాస్టల్ నిర్వహిస్తున్న వార్డెన్ వివేక్ ను అరెస్టు చేసి హాస్టల్ ను సీజ్ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి రాకం రాకేష్,కార్యకర్తలు శశి,కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!