విధి నిర్వహణలో విద్యుత్ షాక్ తో జూనియర్ లైన్ మెన్ మృతి
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామానికి చెందిన చేలుకల ప్రవీణ్ (28)జూనియర్ లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తూ బుధవారం విద్యుత్ షాక్ తో మృతి చెందాడు.వివరాల్లోకి వెళితే చేలుకల మల్లయ్య గంగు తల్లితండ్రుల రెండవ కుమారు డైన ప్రవీణ్ అనాధ అయిన సౌమ్యను ప్రేమ వివాహం చేసుకొని మహబూబాబాద్,గంగారం మండలంలో విధులు నిర్వహిస్తున్నాడు.బుధవారం రాత్రి కోమట్ల గూడెం రోడ్డు సమీపంలో త్రీఫేస్ విద్యుత్ కు అంతరాయం ఏర్పడడంతో సబ్ స్టేషన్ నుంచి ఎల్ సి తీసుకొని మరమ్మతు చేస్తుండగా ఒక్క సారిగా విద్యుత్ ప్రవహించి ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.అలాగే మృతుని భార్య సౌమ్య ప్రస్తుతం 9 నెలల గర్భవతి అని తనకు పుట్ట బోయే బిడ్డకు జన్మ ఇవ్వక ముందే తన తండ్రి మృతి చెందడం వల్ల తన కుటుంబ సభ్యులు,గ్రామస్తులు శోక సముద్రంలో మునిగిపోయారు.